ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై బాంబే హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై న్యాయస్థానం విచారించింది. ఎన్సీబి ప్రత్యేక మెజిస్టేట్ కోర్టుతో పాటు సెషన్స్ కోర్టు కూడా అర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ తిరస్కరించాయి. ఈ క్రమంలో మాజీ అటర్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. తన వాదనల వినిపించే క్రమంలో ఎన్సీబి అధికారులు బాంబే హైకోర్టులో నివేదిక సమర్పించారు. అర్యన్ ఖాన్ కు బెయిల్ ఎందుకు ఇవ్వరాదో అందులో వారు పేర్కోన్నారు.
ఆర్యన్ ఖాన్ సమాజంలో చాలా పరపతి వున్న కుటుంబానికి చెందిన వ్యక్తి అని.. దీంతో ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం వుందని లేదా న్యాయం నుంచి తప్పించుకున అవకాశాలు కూడా వున్నాయని తెలిపారు. అంతేకాక ఇప్పటికే సేకరించిన పలు ఆధారాలు విదేశాలలోని డగ్ర్స్ మాపియాతో అర్యన్ ఖాన్ కు సంబంధాలు వున్నాయిన స్పష్టం చేస్తున్నాయని అన్నారు. అర్బాజ్ మర్చెంట్ నుంచి పోందిన మాదక ద్రవ్యాలను ఆయన తన వద్ద అట్టిపెట్టుకుని వాటిని ఇతరులకు అక్రమంగా పంపిణీ చేశాడని కూడా తమ విచారణలో వెల్లడైందని ఎన్సీబి నివేదికలో పేర్కోంది.
కాగా అర్యన్ ఖాన్ తరుపున బరిలోకి దిగిన ముకుల్ తన వాదనలను వినిపిస్తూ.. అర్యన్ ఖాన్ నుంచి ఎలాంటి మాదక ద్రవ్యాలను ఎన్సీబి అధికారులు స్వాధీనం చేసుకోలేదని అన్నారు. అంతేకాదు అతడు డ్రగ్స్ తీసుకున్నాడని ఎలాంటి వైద్య పరీక్షల్లోనూ నిరూపితం కాలేదు.. అలాంటప్పుడు తన క్లయింట్ ను ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక ఎన్సీబి అధికారులు సేకరించిన వాట్సాఫ్ చాట్ కూడా అర్యన్ ఖాన్ క్రూజ్ లోని రేవ్ పార్టీకి సంబంధించినది కాదని వాదనలు వినిపించారు. ఇక ఈ కేసులో తాజాగా ఎన్సీబీ ముంబై జోనల్ హెడ్ గా వున్న సమీర్ వాంఖేడ్ పై వస్తున్న అరోపణలతోనూ, మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలతోనూ, ప్రభాకర్ సెయిల్ చేసిన అరోపణలతోనూ తన క్లయింట్ కు సంబంధమే లేదని అన్నారు. ఇక ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం రేపు కూడా విచారన కొనసాగించనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more