ముంబైలోని ఓ క్రూయిజ్ షిప్ లో ఏర్పాటుచేసిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న బాలీవుడ్ అగ్రనటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎన్సీబి అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి దొరికిపోయిన ఆర్యన్ ఖాన్ ను ఇవాళ ఆదివారం అరెస్టు చేసిన ఎన్సీబి అధికారులు ఆయనను ఇవాళ ఉదయం న్యాయస్థానంలో హజరు పర్చారు. ఈ క్రమంలో అర్యాన్ ఖాన్ తమ కస్టడీకి అప్పగించాలని ఎన్సీబి అధికారులు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఈ పిటీషన్ పై న్యాయస్థానం విచారించనుంది.
అర్యన్ ఖాన్ తో పాటు ఈ కేసులో అరెస్టైయిన మరో ఇద్దరిని కూడా ఎన్సీబి అధికారులు కస్టడీకి కోరుతున్నారు. డ్రగ్స్ కేసులో వీరి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి వుందని అందుచేత వీరిని వారం రోజుల పాటు విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్సీబి అధికారులు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఎన్సీబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడ్ తెలిపారు. అయితే అరెస్టు తరువాత విచారణలో నిందితులు ఏం సమాచారాన్ని రాబట్టారు..వారికి డ్రగ్ పెడ్లర్ లతో వున్న లింకులు, ఇతరాత్ర సమాచారాన్ని తాను వెల్లడించలేనని తెలిపారు.
కాగా ఈ కేసులో అరెస్టయిన అర్యన్ ఖాన్ ను తనకు బెయిల్ కావాలని న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై కూడా న్యాయస్థానం విచారణ చేయనుంది. ఇదిలావుండగా, ఆదివారం ఉదయం నుంచి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో ఉన్న అర్యన్ ఖాన్ ఏడుస్తూనే ఉన్నాడని అధికారులు తెలిపారు. ముంబై తీరంలో క్రూయిజ్ షిప్ లో జరిగిన ఓ రేవ్ పార్టీపై దాడి చేసిన ఎన్సీబీ అధికారులు అతనితో పాటు పలువురు ఇతర ప్రముఖుల పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆర్యన్ను ఎన్సీబీ ప్రశ్నించింది. సాయంత్రం అతన్ని అరెస్ట్ చేసింది.
ఈ విచారణలో ఆర్యన్ గత నాలుగేళ్ల నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలిందని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. అతడు యూకే, దుబాయ్, ఇతర దేశాలలో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకుంటూనే ఉండేవాడని చెప్పారు. మొత్తం 8 మందిని ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. కార్డెలియా క్రూయిజ్ షిప్లో ఈ రేవ్ పార్టీ జరిగింది. ఆర్యన్తోపాటు అతని స్నేహితుడు అర్బాజ్, మరో ఆరుగురిని ఎన్సీబీ సాయంత్రం అరెస్ట్ చేసి వైద్య పరీక్షలకు తరలించింది. ఆర్యన్పై సెక్షన్ 27 (నార్కోటిక్ డ్రగ్ వినియోగించినందుకు శిక్ష), 8సీ (డ్రగ్స్ తయారీ, ఉత్పత్తి, కలిగి ఉండటం, అమ్మడం లేదా కొనడం)తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more