పాకిస్థాన్కు భారత్ గట్టిగా బదులిచ్చింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని అనడం పట్ల ఐరాసలోని భారత ప్రతినిధి స్నేహ దూబే అభ్యంతరాలు తెలిపారు. జమ్మూకశ్మీర్, లడఖ్ భారత్లో అంతర్భాగమని ఆమె చెప్పారు. వాటిని భారత్ నుంచి ఎవరూ వేరు చేయలేరని స్నేహ చెప్పారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ కేంద్ర బిందువుగా మారుతోందని, ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తున్న విషయాన్ని ప్రపంచ దేశాలు బహిరంగంగానే అంగీకరిస్తున్నాయని గుర్తు చేశారు.
ఐక్యరాజ్యసమితి వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదుల్లో ఎక్కువ శాతం మంది పాకిస్థాన్లో ఉన్న విషయాన్ని గ్రహించాలని ఆమె అన్నారు. ఇప్పటికే పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంలా వుందన్ని విమర్శలు ప్రపంచ దేశాల్లో వినిపిస్తున్నాయని అమె అన్నారు. ఇలాంటి విమర్శలను వింటూకూడా మీరు ఉగ్రవాదులకు ఎలా మద్దుతునిస్తున్నారని అమె ప్రశ్నించారు, ఒసామా బిన్ లాడెన్కు పాకిస్థానే ఆశ్రయం ఇచ్చిందని, అంతేగాక, ఇప్పటికి కూడా ఆ ఉగ్రవాదిని పాక్ ఓ అమరుడిగా గుర్తిస్తోందని ఆమె అన్నారు.
పాక్ అవలంబిస్తున్న విధానాల వల్లే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని ఆమె విమర్శించారు. కాగా, స్నేహ దూబే 2012 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ప్రస్తుతం న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. పుణెలోని ఫెర్గూసన్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఢిల్లీలోని జవర్లాల్ నెహ్రూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి స్నేహ దూబే ఎంఫిల్ పూర్తి చేశారు. ఇమ్రాన్ ఖాన్కు ఆమె దీటుగా సమాధానం ఇవ్వడం పట్ల భారత్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తోంది. మరోవైపు, ఈ రోజు ఐరాస భద్రతా మండలి సమావేశంలో భారత ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్పూర్లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more