టాలీవుడ్ డ్రగ్ కేసు, మనీలాండరింగ్ కేసులో ఓ వైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) టాలీవుడ్ కు చెందిన ప్రముఖులను రోజువారీగా విచారిస్తోంది. ఈ తరుణంలో ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తరుణ్లకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్) క్లీన్ చిట్ ఇచ్చింది. 2017లో వాళ్లు ఇచ్చిన గోళ్లు, వెంట్రుకలు, రక్తం నమునాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చి చెప్పింది. కాగా, 2017 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు పెనుసంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ కేసుతో అభియోగాలను ఎదుర్కోన్న సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అప్పుడే వీరిని ఈడీ అధికారులు విచారించి.. వాంగ్మూలాలు కూడా సేకరించారు. వాటిని కోర్టుకు కూడా సమర్పించారు. కానీ.. ఆ కేసుకు సంబంధించి.. మనీల్యాండరింగ్ జరిగిందా? లేక ఫేమా చట్టాన్ని ఉల్లంఘించారా? అనే వివరాలు తెలుసుకోవడం కోసం.. మళ్లీ 12 మందికి ఈడీ సమన్లు జారీ చేసింది. అందులో 10 మంది సినీ ప్రముఖులు ఉన్నారు. ఆగస్టు 31, 2021న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ను విచారించిన ఈడీ అధికారులు.. ఆ తరువాత చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నవదీప్, రాణా, ముమైత్ ఖాన్ తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు సెలబ్రిటీలను ఈడీ అధికారులు విచారించారు.
అయితే.. నాలుగేళ్ల క్రితమే.. డ్రగ్స్ టెస్ట్ కోసం పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్.. ఇచ్చిన నమూనాలలో వారు మాదకద్రవ్యాలను తీసుకున్నట్లు లేదని తాజాగా ఫోరెన్సిక్ ట్యాబ్ నివేదిక ఇచ్చింది. వారు తమ రక్తం, వెంట్రుకలు, గోర్ల శాంపిల్స్ను ఈడీకి అందించారు. వీళ్లిద్దరు మినహా.. మిగతావాళ్లు ఎవ్వరూ శాంపిల్స్ ఇవ్వలేదు. అప్పుడే వీళ్ల శాంపిల్స్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని తేలింది. తాజాగా.. దర్శకుడు పూరీ, తరుణ్ నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు 100 శాతం లేవని ఎఫ్ఎస్ఎల్ క్లీన్ చిట్ ఇచ్చింది. కాగా, పూరీ, తరుణ్ స్వచ్ఛందంగానే తమ రక్తం, గోర్లు, వెంట్రుకలు ఇచ్చారని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more