ప్రభుత్వ ఆస్తుల ద్రవ్యీకరణ విధానం పట్ల ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు. జాతీయ మానెటైజేషన్ పైప్ లైన్ (ఎన్ఎంపీ) స్కీమ్ ను పట్టపగలు దోపిడీగా చిదంబరం అభివర్ణించారు. దేశం అర్థిక స్వాలంభన సాధించేందుకు గడిచిన 70 ఏళ్ల కాలంలో అనేక వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను కేంద్రం అమ్మకానికి పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తుల విలువతో పోలిస్తే వాటి అమ్మకం ద్వారా వచ్చే మొత్తం స్వల్పమని ఆయన విమర్శించారు.
కేవలం కొన్ని కోట్ల రూపాయల కోసం 70 ఏండ్లుగా సృష్టించిన ఆస్తులను తెగనమ్మడం సరికాదని అన్నారు. ఉదాహరణకు రూ 1.3 లక్షల కోట్ల విలువైన ఆస్తులను రూ 1.5 లక్షల కోట్లకు ఆర్ధిక మంత్రి విక్రయిస్తే దానిపై వచ్చే రాబడి ఎంతని ప్రశ్నించారు. రూ 20,000 కోట్ల అదనపు రాబడి కోసం ఏండ్ల తరబడి సమీకరించిన ఆస్తులను అమ్ముతారా అని చిదంబరం నిలదీశారు. ఇది భారీ కుంభకోణం, పట్టపగలు చేసే దోపిడీ కాక మరేంటని ప్రశ్నించారు. ఇది కేవలం ప్రభుత్వ అస్తులు కావని.. దేశంలోని ప్రతీ పౌరుడి వారసత్వ కష్టార్జితం అన్నారు. తమ తాతలు, తండ్రులు చోమటోడ్చి ప్రభుత్వానికి చెల్లించిన ప్రతి రూపాయితోనే గత ప్రభుత్వాలు ప్రభుత్వానికి ఈ ఆస్తులను సమీకరించాయని ఆయన స్పష్టం చేశారు.
ఇందులో మోడీ మార్కు ప్రభుత్వ కుట్ర కూడా దాగివుందని చిదంబరం అన్నారు. గత ప్రభుత్వాలు గడిచిన 70 ఏండ్లలో ఏం సాదించాయని అడుగుతున్న మోడీకి.. వారు దేశానికి సంపాదించి పెట్టిన ఆస్తులను ద్రవ్యీకరణ చేయడం ద్వారా వారి గుర్తులను కూడా నామరూపాలు లేకుండా చేసే కుట్రదాగి వుందని ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద భారీగా ఆస్తులున్నాయని, వాటిని ప్రభుత్వం సొమ్ము చేసుకుని వనరులను సమీకరిస్తే వాటిని నూతన మౌలిక ప్రాజెక్టులపై ఖర్చు చేయడం, అణగారిన వర్గాల సంక్షేమానికి వెచ్చించేందుకు వెసులుబాటు ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్ధిక సలహాదారు సంజీవ్ సన్యాల్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more