ఆఫ్ఘనిస్తాన్ లోని 32 ప్రావిన్సులను తమ అధీనంలోకి తీసుకున్న తాలిబన్లు ఇక వెనువెంటనే రంగంలోకి దిగి ప్రతీ ఇంటిని తనిఖీ చేస్తున్నారు. గతంలో నాటో దళాలకు పనిచేసిన వారి కోసం గాలింపు చేపడుతున్నారు. వారి కుటుంబసభ్యులను తాలిబన్లు బెరిస్తున్నట్లు యూఎన్ చెప్పింది. ఎటువంటి ప్రతీకారం తీర్చుకోమని తాలిబన్లు చెప్పినా.. ప్రస్తుతం ఆ మిలిటెంట్లు మానవవేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా కొందర్ని తాలిబన్లు టార్గెట్ చేస్తున్నారని, ఆ బెదిరింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిప్టో నార్వేయన్ సెంటర్ తన నివేదికలో తెలిపింది.
ఇదలావుండగా అప్ఘనిస్తాన్ లోని తీవ్ర సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలోని కందహార్ సహా హెరత్ లలో వున్న భారత రాయబార కార్యాలయాలు మూసివేశారు. అయితే ఇంటింటా తనీఖీలు చేస్తున్న తాలిబన్లు మూసివున్న భారత కాన్సులేట్లను ముట్టడించారు. తలుపులు బద్దలు కోట్టి మరీ ఆ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. కార్యాలయాల్లో ఉన్న పేపర్లను, పార్క్ చేసిన కార్లను తీసుకువెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రెండు కాన్సులేట్లలో ఉన్న అన్ని వస్తువుల్ని వాళ్లు పరిశీలించారు. గత ఆదివారం కాబూల్ను చేజిక్కించుకున్న తాలిబన్లు.. ఆ నగరంలో డోర్ టు డోర్ తనిఖీ చేపడుతున్నారు.
జాతీయ భద్రత విభాగం కోసం పనిచేసిన వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో భారత్కు చెందిన నాలుగు దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. కాబూల్లో అదనంగా మరో ఎంబసీ ఉన్నది. కాందహార్, హీరత్తో పాటు మజార్ యే షరీఫ్ పట్టణంలోనూ భారతీయ కాన్సులేట్ ఉంది. అయితే తాలిబన్ మిలిటెంట్లు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొన్ని రోజుల ముందే మజార్ యే షరీఫ్ కాన్సులేట్ను మూసివేశారు. మూడు రోజుల్లోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి సుమారు 200 మంది దౌత్య సిబ్బందిని తరలించినట్లు రాయబారి రుద్రేంద్ర టండన్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more