అంగారకుడి మీద జీవం గుట్టును తెలుసుకునేందుకు ఇప్పుడు పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా నీటి జాడను పసిగట్టేందుకు శాస్త్రవేత్తలు అనునిత్యం కృషి చేస్తున్నారు. నీళ్లున్నాయని ఎంతో కాలంగా చెబుతూ వస్తున్నారు. తాజాగా గత నెలలో అరుణ గ్రహం దక్షిణ ధ్రువం వద్ద కొన్ని కొలనులున్నట్టు గుర్తించారు. నీటి జాడలున్నాయని నిర్ధారించారు. అయితే, అవి నీళ్లు కాదని తాజాగా నాసాలోని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు తేల్చారు. మార్స్ సబ్ సర్ఫేస్ లో నీళ్లను గుర్తించినట్టు ఇటలీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్త 2018లో ప్రకటించారు.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) మార్స్ ఎక్స్ ప్రెస్ ఆర్బిటర్ లోని రాడార్ గుర్తించిన ఆనవాళ్ల ప్రకారం అవి నీటి జాడలని పేర్కొన్నారు. దీంతో సంచలనకరంగా మారిన విషయమై తాజాగా పరిశోధన సాగింది. రాడర్ ఆనవాళ్లను పరిశీలించిన నాసా జేపీఎల్ శాస్త్రవేత్తలు.. అవి నీటి జాడలు కావని.. బహుశా మట్టి జాడలు అయిఉంటాయని తేల్చారు. అతి శీతలమైన ల్యాబ్ లో వారు పరిశోధన చేశారు. మార్స్ పై ఉన్న ఆ సరస్సులన్నీ అతి శీతలమైన ప్రాంతాల్లోనే ఉన్నాయని, కాబట్టి అక్కడ నీరు ద్రవరూపంలో ఉండే అవకాశమే లేదని నిర్ధారించారు.
ఆదిత్య ఆర్. ఖుల్లర్, జెఫ్రీ జె. ప్లాట్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దాదాపు 44 వేల రాడార్ శబ్దాలను విశ్లేషించారు. అంగారకుడి ఉపరితలానికి అతి సమీపంలో రాడార్లు పంపించిన సిగ్నళ్లు నీటికి సంబంధించినవి కాదని గుర్తించారు. అక్కడ నీరు గడ్డకట్టిన స్థితిలోనే ఉంటుందని, బహుశా రాడార్లు గుర్తించింది మట్టివేమోనని కంప్యూటర్ మోడల్స్ ద్వారా నిర్ధారించారు. ఎత్తైన కొండల నుంచి ఇసుక, గులక రాళ్లు కిందకు వచ్చి ఉంటాయని తేల్చారు. అయితే, రాడార్ సిగ్నళ్లు ఏంటన్నది ప్రస్తుతానికి కచ్చితంగా నిర్ధారించలేమని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more