మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన మంత్రి పదవితో పాటు శాసనసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. బీజేపిలో చేరిన ఈటెల మరోమారు తనను బలపర్చాలని, ఆశీర్వదించాలని కోరుతూ హుజూరాబాద్ ప్రజలను కోరుతూ ఇప్పటికే జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ పార్టీలపై ఇప్పటికే విమర్శలను కూడా గుప్పిస్తున్నారు. ఈటెలను ఎదుర్కోనే బలమైన నేత కోసం అధికార పార్టీ చేతులెత్తేసింది.
ఈ క్రమంలో అధికార పార్టీ మిమాంసలో పడింది. తమ పార్టీలో ఈటెలను ఎదురించే స్థాయి నాయకుడు ఎవరూ లేరని గ్రహించిన టీఆర్ఎస్.. వలస నేతను తమ తరపున రంగంలోకి దింపనుందని పాలని యోచనలో వుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత పాడి కౌశిక్రెడ్డికి సంబంధించి ఓ ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది. ఓ కార్యకర్తతో ఫోన్ లో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నుంచి పోటీచేయడానికి ఆ టికెట్ తనకే ఖరారైనట్లు తెలిపారు. ఎన్నిక నేపథ్యంలో యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని అన్నారు. ఒక్కొక్కరికీ 2 లేక 3 వేల రూపాయల చొప్పున ఇస్తానని అన్నారు.
దీనిపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని ఆ కార్యకర్తకు కౌశిక్రెడ్డి చెప్పారు. కాగా, ఇటీవలే మంత్రి కేటీఆర్ ను కూడా కౌశిక్రెడ్డి కలిశారు. కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్ అవుతుండడం కలకలం రేపుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు జరుపుతున్నాయి. గతంలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఈటల చేతిలో కౌశిక్ రెడ్డి ఓడిపోయారు. ఇక ఈ సారి ఎన్నికలలో ఆయనను ఎలాగైనా ఢీకొట్టాలని.. దుబ్బాక పరిణామాలు ఇక్కడ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆడియో సారాంశాన్ని మీరూ వినండి..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more