ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాత్రి పోద్దుపోయిన తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాలుగు నెలల లోపునే ఆయన తన మంత్రిపదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. క్రితం రోజు రాత్రి పదకొండు గంటల సమయం దాటిన తరువాత ఆయన తన క్యాబినెట్ మంత్రులను వెంటబెట్టుకుని రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ బేబి రాణి మౌర్య కలసి ఆమెకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
నాలుగు నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తీరత్ సింగ్ ఆరు నెలల లోపు శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది. రాష్ట్రంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఎన్నికలు జరగడం అనుమానంగానే ఉంది. గడువు ముగిసే వరకు పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉండడంతో దానిని నివారించేందుకు ముందస్తుగా ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సొంతపార్టీ నుంచి కూడా ఆయనకు నిరసన సెగ మొదలైంది.
ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా హస్తినలోనే మకాం వేసిన తీరత్ సింగ్ నిన్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. త్వరలో ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రంలో రాజకీయంగా సమస్యలు ఉత్పన్నం కావడాన్ని అధిష్టానం దృష్టిసారించింది. దీంతో అంతర్గతంగా పరిస్థితులను చక్కదిద్దేందుకు తీరత్ సింగ్ రావత్ ను రాజీనమా చేయాలని అదేశించినట్లు సమాచారం. దీంతో తీరత్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తీరత్ సింగ్ ప్రస్తుతం గర్వాల్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఉత్తరాఖండ్లో రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు ఈసారి సిట్టింగ్ అభ్యర్థికే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more