కరోనామహమ్మారి అనేకానేకులను మృత్యువాత పడేట్లు చేయడంతో పురపాలక సంఘం అధికారులకు వారి పేరున డెత్ సర్టిఫికెట్లు జారీ చేయడంలోనూ పూర్తి బిజిగా మారారు. అయితే సాధారణ సమయంలో డెత్ సర్టిఫికెట్ ఇమ్మంటే లంచం ఇస్తేనే గానీ జరగని పనులు.. ఇప్పుడు ఆపద సమయంలో మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. అయితే గతంలో బతికున్న వ్యక్తులు చనిపోయారని డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఘటనల గురించి విన్నాం. కానీ ఏకంగా బతికున్న వ్యక్తికే ఫోన్ చేసి ‘నీ డెత్ సర్టిఫికేట్ రెడీగా ఉంది వచ్చి తీసుకెళ్లు అని ఫోన్ చేసిన అధికారుల గురించి ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? అటువంటి ఘనకార్యమే చేశారు అధికారులు.
మహారాష్ట్రలోని థానే మున్సిపల్ అధికారులు చంద్రశేఖర్ అనే 55 ఏళ్ల ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి.. మీ డెత్ సర్టిఫికెట్ రెడీగా వుంది వచ్చి తీసుకెళ్లండీ అన్నారు. దీంతో షాక్ తిన్న చంద్రశేఖర్.. తేరుకుని ఏంటీ అని అడగ్గా మళ్లీ అదే మాట వినబడింది. దీంతో చంద్రశేఖర్ కు మండిపోయింది. కాస్త వెటకారంగా ‘హలో సార్.. మీరు ఇప్పుడు మాట్లాడుతుంది ఆ మరణించిన వ్యక్తితోనే.. మీరు డెత్ సర్టిఫికెట్ రెడీ చేసిన వ్యక్తితోనే.. ఎప్పుడు రమ్మంటారు? నా డెత్ సర్టిఫికెట్ కలెక్ట్ చేసుకోవటానికి’? అని అడుగగా..ఈ సారి షాక్ అవ్వటం సదరు అధికారి వంతు అయ్యింది. దానికి మాట మారుస్తూ..‘మీ కుటుంబంలో ఎవరైనా కోవిడ్తో మరణించారా? అని ప్రశ్నించారు. దానికి చంద్రశేఖర్ లేదని చెప్పడంతో ఫోన్ కట్ చేశారు.
అధికారులు ఫోన్ కట్ చేశాక చంద్రశేఖర్ దేశాయ్ ..అసలు జరిగింది ఏంటో తెలుసుకునేందుకు థానే మున్నిపల్ కార్పొరేషన్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ తన పేరుతోను అన్ని వివరాలతోను ఉన్న డెత్ సర్టిఫికెట్ అడిగి తీసుకని దాన్ని పూర్తిగా పరిశీలించి మరోసారి అవాక్కయ్యారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నుంచి వచ్చిన సమాచారం ప్రకారం..చంద్రశేఖర్ దేశాయ్ 2021 ఏప్రిల్ 22 న మరణించాడని అందులో ఉంది. అయితే పొరపాటు ఎక్కడ జరిగిందనే విషయంపై అధికారులను ప్రశ్నించగా.. వారి నుంచి సరైన సమాధానం రాలేదని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more