పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అక్కడి ఐఎస్ఐ సహా ఆర్మీ సహకారంతో భారత్ పై సరికొత్త తరహాలో దాడులకు తెగబడుతున్నాయి. భారత అర్మీకి చెందిన బేస్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. భారత్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ దాడి జరిగిన 24 గంటల వ్యవధి కూడా గడవక ముందే మరోమారు రెండు డ్రోన్లు భారత్ ఆర్మీ ఎయిర్ వేస్ ను స్థావరాన్ని టార్టెట్ చేసి దాడులకు యత్నించడం కలకలం రేపాయి. జమ్ములోని కాలుచాక్ మిలిటరీ స్టేషన్ లో ఆదివారం అర్ధరాత్రి కనిపించాయి.
రాత్రి 11.30 నిమిషాలకు ఓ డ్రోన్ ఆర్మీ బేస్పై ఎగురుతూ కనిపించగా.. మరొకటి అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల ప్రాంతంలో కనిపించింది. వెంటనే అలెర్ట్ అయిన ఆర్మీ జవాన్లు వాటిపై ఫైరింగ్ జరిపారు. జమ్ము పఠాన్ కోట్ నేషనల్ హైవేపై కాలుచాక్-పూర్మాండల్ ప్రాంతంలో రెండు క్వాడ్ కాప్టర్స్ కనిపించాయి. కాలుచాక్ మిలిటరీ స్టేషన్ కు దగ్గరగా ఎగురుతూ కనిపించాయి అని పోలీసులు వెల్లడించారు. ఆర్మీ జవాన్లు 20-25 రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే చీకట్లో ఆ రెండు డ్రోన్లు తప్పించుకుని వెళ్లిపోయాయి. వాటిని కనిపెట్టడానికి పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
భారత బలగాల కాల్పులతో ఆగంతకులు డ్రోన్లను వెనక్కు తీసుకెళ్లారు. రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు డ్రోన్ దాడికి యత్నించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జమ్ము ప్రాంతంలో ముఖ్యంగా ఆర్మీ స్టేషన్లలో హై అలెర్ట్ ప్రకటించారు. జమ్ములో ఎయిర్ఫోర్స్ స్టేషన్పై తొలిసారి డ్రోన్ దాడి జరిగిన మరుసటి రోజే ఇలా మరో రెండు డ్రోన్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. డ్రోన్లతో దాడి చేయడం అనేది ఇదే తొలిసారి. ఆదివారం తెల్లవారుఝామున రెండు పేలుళ్లు జరిగాయి. ఈ ఉగ్రదాడిపై జమ్ముకశ్మీర్ పోలీసులు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు జరుపుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more