ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు బ్రేక్ పడింది. ఈ పనులను తక్షణం నిలిపివేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కొనసాగిస్తోందని తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై స్పందించిన బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పనులను అపాలని అదేశాలను జారీ చేసింది. ఈ మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తక్షణమే ఆపాలంటూ లేఖ రాసిన బోర్డు అందులో ఈ అదేశాలను పేర్కోంది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ( ఎన్జీటీ ) గత ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాలలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని స్పష్టంగా చెప్పారని కృష్ణా నది యాజమాన్య బోర్డు లేఖలో ప్రస్తావించింది. కేఆర్ఎంబీ నిపుణుల కమిటీ పర్యటనకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించడం లేదు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. అయితే రాయలసీమ లిప్టు ఇరిగేషన్ పనులపై డీటైయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సమర్పించిన తరువాత ఈ పనులు ప్రారంభించాలని సూచించింది.
అయితే ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్ లు ఆంధ్రప్రదేశ్ రివర్స్ యాక్ట్-2014 ప్రకారం సెంట్రల్ వాటర్ కమీషన్ (సిడబ్యూసీ)తో పాటుగా అపెక్స్ కౌన్సీల్ ఆమోదం పొందాలని కూడా సూచించింది. అప్పటి వరకు రాయలసీమ ఎత్తిపోతల పనులు ముందుకు వెళ్లొద్దు అని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటర్ రిసోర్సెస్ డిపార్డుమెంటు కార్యదర్శికి కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సభ్యుడు హెచ్ఆర్ మీనా లేఖ రాస్తూ.. రాయలసీమ లిప్టు ఇరిగేషన్ పనులపై అందిన పిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చట్టరిత్యా ట్రిబ్యూనల్ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని ప్రస్తావించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more