India's Covid-19 record, more than 4 Lakh mark దేశంలో 4 ల‌క్ష‌లు దాటిన కేసులు.. 24 గంటల్లో 3,523 మరణాలు

Coronavirus in india india reports 4 lakh new cases taking tally to 1 03 crore

Coronavirus cases India, Coronavirus India update, Coronavirus india testing centres, coronavirus vaccine, coronavirus testing india labs, coronavirus deaths india, Coronavirus, Covid-19, Maharashtra, Tamil Nadu, Delhi, Health Ministry, corona fatility, corona cases India

India's coronavirus cases hit a grim global record with 4,01,993 fresh infections in the last 24 hours. 3,523 deaths were reported. The third phase of the world's largest vaccination drive has started today even as several states flag shortage.

దేశంలో కోవిడ్ రికార్డు: 4 లక్షలు ధాటిన కేసులు.. 24 గంటల్లో 3,523 మరణాలు

Posted: 05/01/2021 12:47 PM IST
Coronavirus in india india reports 4 lakh new cases taking tally to 1 03 crore

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ లో వివిధ రకాల సైయిన్ లు భారతీయులను పట్టి పీడిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కరోనా కేసులు ఏకంగా నాలుగు లక్షల మార్కును అధిగమించిన ప్రపంచంలోనే ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదును చేసుకున్నాయి. దీంతో దేశంలో మొత్తంగా కోటి 91 లక్షల మార్కు దాటగా, అదే తరుణంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా ఏకంగా కోటి 57 లక్షల మార్కుకు చేరువలో వుంది. కాగా ఇదే సమయంలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 3500 మరణాలు కూడా సంభవించాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఏకంగా యాభై మందికి పైగా ప్రజలు కరోనా సోకి అసువులు బాసారు.

గత ఏడాది మార్చి నుంచి దేశంలో తన ప్రభావాన్ని ఉద్దృతంగా పెంచుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా మహమ్మారి.. నవంబర్ నుంచి కాసింత తగ్గుముఖం పడుతూ.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సెకెండ్ వేవ్ ఉద్దృతిని కొనసాగిస్తోంది. దీంతో మరోమారు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఒక్కరోజులో ఏకంగా నాలుగు లక్షల సంఖ్యకు పైబడి కరోనా కేసులు నమోదయ్యయి. దీంతో ప్రపంచంలోనే ఒక్క రోజులో అత్యధిక కేసులను నమోదు చేసుకున్న దేశంగా భారత్ మిగిలిపోయింది. ఈ సెంకెండ్ వేవ్ కేసులు ఉద్దృతి మరింతగా పెరగడానికి కారణం దేశంలో కరోనా స్టైయిన్ రకాలు అనేకంగా నమోదు కావడమేనని కూడా వైద్యవర్గాలు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలో కరోనా బారిన పడిన రాష్ట్రాల్లో మహరాష్ట్ర ముందంజలో వుంది. మహారాష్ట్ర నుంచి 62919 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత అధ్యధిక సంఖ్యలో కర్ణాటక నుంచి కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 48,396 కేసులు నమోదు కాగా, కేరళలో 37,199 కేసులు నమోదయ్యాయి.

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన గణంకాల ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో 2,99,988 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 1,91,64,969కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 3,523 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,11,853 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,56,84,406 మంది కోలుకున్నారు. 32,68,710 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,49,89,635 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 28,83,37,385 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,45,299 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

ఇక ఇటు తెలంగాణలోనూ క‌రోనా ఉద్ధృతి కొన‌సాగుతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 7,754 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 6,542 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,360కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,62,160 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,312గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 78,888 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,507 మందికి క‌రోనా సోకింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  Maharashtra  Tamil Nadu  Delhi  Health Ministry  corona fatility  corona cases India  

Other Articles