(Image source from: Thehansindia.com)
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ద్వితీయ పర్యాయ విజృంభన కొనసాగుతున్న తరుణంలో.. ప్రజల అజాగ్రత్త, నిర్లక్ష్యపు చర్యలు ఉదృతిని మరింతగా పుంజుకునేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ బీజేపి అద్యక్షుడు కేంద్రంతో నెరిపిన మంత్రాంగం పనిచేసింది. తెలంగాణలో కరోనా విజృంజనను.. సెకెండ్ వేవ్ ఉద్దృతిని కేంద్రానికి అర్థం చేయించడంలో విజయం సాధించిన ఆయన కేంద్రం నుంచి ప్రత్యేక కోటాను రాష్ట్రానికి తీసుకురావడంలో సఫలీకృతుడయ్యాడు. రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్లు అందకపోవడం.. కరోనా చికిత్సలో వినియోగించే రెమీడిసివీర్ వంటి ఔషదాలు అందుబాటులో లేకపోవడంతో.. అనేక మంది రోగులు అసువులు బాస్తున్నారు.
ఈ సమస్యపై కేంద్రానికి వివరించడంలో.. కేంద్రమంత్రులకు దృష్టికి సమస్య తీవ్రతను తీసుకురావడంలో బండి సంజయ్ విజయం సాధించారు. కేంద్రం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు కరోనా చికిత్సకు అవసనమైన ఔషదాలను తీసుకువస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన రోగులకు ఉపశమనం లభించే అవకాశాలు వున్నాయి. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు హస్తినకు వెళ్లి అక్కడి కేంద్రమంత్రులు, బీజేపి పెద్దలకు తెలంగాణలో నెలకొన్న దారుణ పరిస్థితులను వివరించి.. రాష్ట్రానికి అవసరమైన సరంజామాను సమకూర్చడంలో విజయం సాధించారు.
తమ రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ సిలిండర్లతో పాటు కరోనా చికిత్సకు అత్యవసరమైన ఔషదాలను అందించడంలో వివక్ష చూపుతోందని.. ఇలాంటి వివక్షతో రాజకీయ లాభం పోందాలనుకోవడం అవివేకమని తెలంగాణ వైద్యఅరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలా ఆయన ధ్వజమెత్తిన 24 గంటల వ్యవధిలోనే రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లి మంత్రాంగం నెరపి రాష్ట్రానికి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకురావడంలో సఫలీకృతుడయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more