ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, తనకు మధ్య జరిగిన సంభాషణ సమాచారం లీక్ కావడంపై విస్మయం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తాను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో ముఖాముఖీగా జరిగిన సంబాషణ ఏకంగా గవర్నర్ కార్యాలయం నుంచే లీక్ కావడంపై ఆయన రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. గవర్నర్ తో పంచుకున్న అత్యంత కీలక సమాచారం లీక్ అయిందని తన పిటీషన్ లో పేర్కోన్నారు. ఆ సమాచారం గవర్నర్ కార్యాలయం నుంచి బయటకు రావడంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.
తన పిటీషన్ లో ప్రతివాదులుగా రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఆధిత్యనాథ్ దాస్, గవర్నర్ ముఖ్యకార్యదర్శితో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ పేర్లను చేర్చారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ వేసిన పిటిషన్ ను వేరే బెంచ్కు బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇదిలావుండగా గవర్నర్ తో కీలకమైన సమావేశానికి శుక్రవారం రాజ్ భవన్ కు రావాల్సిందిగా అదేశాలు వచ్చినా ఆయన హైదరాబాదుకు వెళ్లడం చేత సమావేశానికి హాజరుకాలేకపోయారు.
అయితే ఈ సమావేశంలో రాష్ట్రంలో నిర్వహించాల్సిన పరిషత్ ఎన్నికల విషయమై చర్చించేందుకని సమాచారం. మరోవైపు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహణ విషయమై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో తీర్పు రిజర్వు చేయబడింది. రాష్ట్రంలో మండల. జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల కమీషన్ తరఫు న్యాయవాది అశ్విన్ కుమార్.. తమ వాదనలు వినిపిస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే పిటిషన్ దాఖలు చేయడం సరికాదని చెప్పారు.
ఎన్నికల పరిశీలన దశలోనే పిటిషన్ దాఖలు చేయడం తొందపాటు చర్య అని తెలిపారు. పరిషత్ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ పరంగా ఎన్నికల కమీషన్ బాధ్యత అని చెప్పారు. ఎన్నికలను నిర్వహించే అంశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా పరిషత్ ఎన్నికల నేపథ్యంలోనూ ఎన్నికల కమీషన్ నూతన నోటిఫికేషన్ ఇవ్వకుండా రీ-నోటిఫికేషన్ మాత్రమే ఇస్తుందని ఎన్నికల కమీషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు విచారణను ముగించి, తీర్పును రిజర్వు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more