బిపార్మసీ విద్యార్థిని సామూహిక అత్యాచార కేసులో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలు తన తల్లికి చెప్పింది అబద్దమని పోలీసుల విచారణలో తేలింది. ఇక యువతిని అటో డ్రైవర్ సహా ముగ్గురు కిడ్నాప్ చేశారన్న విషయంలోనూ బాధితురాలు అబద్దమే చెప్పిందని సిసిటీవీ ఫూటేజీలు స్పష్టం చేస్తున్నాయి. అసలు జరిగిన విషయాన్ని దాచిపెట్టిన యువతి.. తన తల్లికి అబద్దాలను చెప్పడంతో.. అసలేం జరిగిందన్న వివరాలపై అటు నిందితులను, బాధితురాలిని విచారించిన పోలీసులు సీసీటీవీలను పరిశీలించడంతో కొత్త కోణాలు వెలుగుచూశాయి.
తనను ఆటోడ్రైవర్లు అపహరించారని, తాను దిగవల్సిన స్టాఫ్ వచ్చినా.. అటోను ఆపకుండా ఎక్కడికో తీసుకువెళ్తున్నారని యువతి తన తల్లికి అందించిన సమాచారాన్ని అమె నిజమని నమ్మి.. తన కూతురు ఆపదలో వుందంటూ.. రక్షించాల్సిందిగా పోలీసులకు ఫోన్ చేసిన విషయం.. వారు వేగంగా రంగంలోకి దిగి.. యంనంపేట వద్ద పోదల్లో అపస్మారక స్థితిలో పడివున్న బాధితురాలిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజు బాలికకు గాంధీ అసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిగా అమెపై అత్యాచారం జరిగిందని వైద్యుల నివేదికలో వెల్లడైంది.
ఈ మొత్తం కేసును బాధిత యువతి తప్పదారి పట్టించినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. బాధితురాలు కాలేజీ నుంచి తిరిగివస్తూ ఆటో ఎక్కి రాంపల్లి వరకు వెళ్లింది. అయితే రాంపల్లిలో అటో నుంచి దిగిన అమె.. అప్పటికే అమె కోసం అక్కడ వేచి చూస్తున్న అమె బాయ్ ఫ్రెండ్ బైక్ పై ఎక్కి వెళ్లింది. ఓ నిర్మాణుష్య ప్రాంతానికి అమెను తీసుకెళ్లిన ప్రియుడు అక్కడ అమెతో పాటు తన ఇద్దరు సోదరులతో కలసి గంజాయి సేవించాడు. ఆ మత్తులో యువతి ఉండగానే పైకంలోనూ అమెను తాము అనుభవిస్తామని.. అనుమతి తీసుకున్నాడు. అమె అంగీకరించడంతో తన సోదరులతో కలసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిసింది.
అయితే సాయం సంధ్యవేళ దాటినా ఇంకా తన కూతురు ఇంటికి రాలేదన్న దిగులు ఒక పక్కా.. అసలే రోజులు బాగోలేవన్న అలోచనలు మరోపక్కా మదిని తొలుస్తున్న క్రమంలో అమె తల్లి భాదిత యువతికి తరచూ ఫోన్ చేస్తూనే వుంది. ఈ క్రమంలో నోటికి వచ్చినట్టుగా అబద్దాలను చెప్పిన యువతి తనను ఆటో డ్రైవర్లు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని చెప్పింది. దీంతో భయపడిన తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు అమె సెల్ ఫోన్ సిగ్నెల్ అధారంగా ట్రేస్ చేసుకుంటూ వచ్చినా.. ఘోరం జరిగిపోయిందని అందోళన చెందారు.
అయితే యువతి మత్తులో వుండటంలో అమెను చికిత్స నిమిత్తం అసుపత్రిలో చేర్పించిన పోలీసులు మరుసటి రోజున అమెను విచారించిన పోలీసులకు అమె.. ఆటోడ్రైవర్లు అత్యాచారం చేశారని తెలిపింది. ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలించగా యువతి ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్లు కనిపించింది. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. స్నేహితులతో కలిసి యానంపేట పరిసరాల్లోకి వెళ్లానని యువతి ఒప్పుకొన్నట్లు సమాచారం. ఒక్క అబద్దం జీవితాన్ని ఎన్ని అనర్థాల పాలు చేస్తుందో ఈ ఘటనే సాక్ష్యం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more