New Twist in B Pharmacy student rape Case ఫార్మసీ విద్యార్థిని అత్యాచార కేసులో కొత్త ట్విస్ట్

New twist in b pharmacy student rape case

b pharmacy student, b pharmacy student kidnapped, b pharmacy student abduction, b pharmacy student keesara, b pharmacy student ghatkesar, auto driver, another disha case, jodimetla, abduction, attempt rape, Rampalli, Medchal Malkajgiri district, crime, crime news, crime news today, hyderabad crime news today, hyderabad rape victim latest news

Four autorickshaw drivers were taken into custody by the Rachakonda police in connection with the abduction and gang rape of 19-year-old Pharma student. Sensational things are revealed by the accused in the investigation.

ఫార్మసీ విద్యార్థిని అత్యాచార కేసులో కొత్త ట్విస్ట్

Posted: 02/12/2021 06:11 PM IST
New twist in b pharmacy student rape case

బిపార్మసీ విద్యార్థిని సామూహిక అత్యాచార కేసులో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలు తన తల్లికి చెప్పింది అబద్దమని పోలీసుల విచారణలో తేలింది. ఇక యువతిని అటో డ్రైవర్ సహా ముగ్గురు కిడ్నాప్ చేశారన్న విషయంలోనూ బాధితురాలు అబద్దమే చెప్పిందని సిసిటీవీ ఫూటేజీలు స్పష్టం చేస్తున్నాయి. అసలు జరిగిన విషయాన్ని దాచిపెట్టిన యువతి.. తన తల్లికి అబద్దాలను చెప్పడంతో.. అసలేం జరిగిందన్న వివరాలపై అటు నిందితులను, బాధితురాలిని విచారించిన పోలీసులు సీసీటీవీలను పరిశీలించడంతో కొత్త కోణాలు వెలుగుచూశాయి.

తనను ఆటోడ్రైవర్లు అపహరించారని, తాను దిగవల్సిన స్టాఫ్ వచ్చినా.. అటోను ఆపకుండా ఎక్కడికో తీసుకువెళ్తున్నారని యువతి తన తల్లికి అందించిన సమాచారాన్ని అమె నిజమని నమ్మి.. తన కూతురు ఆపదలో వుందంటూ.. రక్షించాల్సిందిగా పోలీసులకు ఫోన్ చేసిన విషయం.. వారు వేగంగా రంగంలోకి దిగి.. యంనంపేట వద్ద పోదల్లో అపస్మారక స్థితిలో పడివున్న బాధితురాలిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజు బాలికకు గాంధీ అసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిగా అమెపై అత్యాచారం జరిగిందని వైద్యుల నివేదికలో వెల్లడైంది.

ఈ మొత్తం కేసును బాధిత యువతి తప్పదారి పట్టించినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. బాధితురాలు కాలేజీ నుంచి తిరిగివస్తూ ఆటో ఎక్కి రాంపల్లి వరకు వెళ్లింది. అయితే రాంపల్లిలో అటో నుంచి దిగిన అమె.. అప్పటికే అమె కోసం అక్కడ వేచి చూస్తున్న అమె బాయ్ ఫ్రెండ్ బైక్ పై ఎక్కి వెళ్లింది. ఓ నిర్మాణుష్య ప్రాంతానికి అమెను తీసుకెళ్లిన ప్రియుడు అక్కడ అమెతో పాటు తన ఇద్దరు సోదరులతో కలసి గంజాయి సేవించాడు. ఆ మత్తులో యువతి ఉండగానే పైకంలోనూ అమెను తాము అనుభవిస్తామని.. అనుమతి తీసుకున్నాడు. అమె అంగీకరించడంతో తన సోదరులతో కలసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిసింది.

అయితే సాయం సంధ్యవేళ దాటినా ఇంకా తన కూతురు ఇంటికి రాలేదన్న దిగులు ఒక పక్కా.. అసలే రోజులు బాగోలేవన్న అలోచనలు మరోపక్కా మదిని తొలుస్తున్న క్రమంలో అమె తల్లి భాదిత యువతికి తరచూ ఫోన్ చేస్తూనే వుంది. ఈ క్రమంలో నోటికి వచ్చినట్టుగా అబద్దాలను చెప్పిన యువతి తనను ఆటో డ్రైవర్లు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని చెప్పింది. దీంతో భయపడిన తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు అమె సెల్ ఫోన్ సిగ్నెల్ అధారంగా ట్రేస్ చేసుకుంటూ వచ్చినా.. ఘోరం జరిగిపోయిందని అందోళన చెందారు.

అయితే యువతి మత్తులో వుండటంలో అమెను చికిత్స నిమిత్తం అసుపత్రిలో చేర్పించిన పోలీసులు మరుసటి రోజున అమెను విచారించిన పోలీసులకు అమె.. ఆటోడ్రైవర్లు అత్యాచారం చేశారని తెలిపింది. ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలించగా యువతి ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్లు కనిపించింది. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. స్నేహితులతో కలిసి యానంపేట పరిసరాల్లోకి వెళ్లానని యువతి ఒప్పుకొన్నట్లు  సమాచారం. ఒక్క అబద్దం జీవితాన్ని ఎన్ని అనర్థాల పాలు చేస్తుందో ఈ ఘటనే సాక్ష్యం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles