(Image source from: Independent.co.uk)
దాయాధి పాకిస్థాన్ తాను పెంచిపోషిస్తున్న ఉగ్రవాదానికి తమ దేశ భావిపౌరులే అమరులయ్యారు, పెషావర్ నగరంలో ఇవాళ భారీ బాంబు పేలుడు సంభవించింది, అది కూడా చిన్నారి విద్యార్ధులు చదివే మదర్సాలను కేంద్రంగా చేసుకుని బాంబు అమర్చారు. దీంతో బాంబు విస్పోటనం ధాటికి ఏడుగురు చిన్నారులు మృత్యుఒడికి చేరుకున్నారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెషావర్ నగర శివార్లలో ఉన్న ‘ఇస్లామిక్ సెమినరీ’ని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ బాంబును అమర్చినట్టుగా అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. తరగతులు జరుగుతుండగా.. అకస్మాత్తుగా పేలిన ఈ బాంబు విస్పోటన భారీ పేలుడు శబ్దానికే భయకంపితులైన చిన్నారులు అసువులు బాసారు.
స్థానిక మదర్సాలోకి ఓ గుర్తు తెలియని దుండగుడు బ్యాగుతో ప్రవేశించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. పేలుడులో ఐఈడీని ఉపయోగించినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. దాదాపు ఐదు కిలోల ఐఈడీని ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. ఆ ఉగ్రవాద ఘోరకలికి ఏడుగురు చిన్నారులు బలికాగా, సుమారు 70 మంది స్థానికులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ది లేడీ రీడింగ్ అసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా సదరు అసుపత్రి అధికార ప్రతినిధి తమ అసుపత్రికి 70 మంది క్షతగాత్రులురాగా, వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
కాగా అభంశుభం ఎరుగని ఏడుగురు చిన్నారులను బలిగొన్న ఈ దారుణ ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. పాకిస్థాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాద మూకలే ఈ దారుణానికి ఒడిగట్టాయని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పాకిస్థాన్ అర్మీ స్కూల్ లోకి వెళ్లి దాడులకు పాల్పడిన ముష్కర మూకల దాడి గుర్తుకు వస్తోంది. కాగా ఈ దాడిని పాకిస్థాన్ అధికార, విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అఫ్గానిస్థాన్ తో సరిహద్దులు పంచుకునే ఖైబర్ పంఖ్తుంక్వా రాష్ట్రానికి పెషావర్ నగరం రాజధాని. ఒకప్పుడు ఉగ్రవాద దాడులకు ఇది కేంద్రంగా ఉండేది. భద్రతా సిబ్బంది, జన సమూహాలను లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులకు పాల్పడేవారు. ఉగ్రవాద దాడులతో పాటు వేర్పాటువాదుల వల్ల కూడా అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతుండేవి.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more