పాలకులు నిర్లక్ష్యం.. అధికారులు పర్యవేక్షణా లోపం.. కాంట్రాక్టర్ల ధనదాహం వెరసి ప్రజాధనం నీటమునిగింది. మరోలా చెప్పాలంటే నీటి వరదలో కొట్టుకుపోయింది. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా నదిపై నిర్మించిన బ్రిడ్జి మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్దమవుతుండగా పరిసర గ్రామాల ప్రజల ఆశలను అడియాశలు చేస్తూ కోట్టుకుపోయింది. ఇక త్వరలోనే తమకు కష్టాలు దూరమవుతున్నాయని భావిస్తున్న ఆయా గ్రామాల ప్రజలను మరిన్ని కష్టాల్లోకి నెట్టేలా వుందీ ఘటన. దేశంలో.. రాష్ట్రంలో అవినీతికి అడ్రస్ లేకుండా చేస్తున్నామని చెబుతున్న కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రభుత్వాల ప్రసంగాలకు సవాల్ విసిరేలా జరిగిందీ ఘటన.
బీహార్ లోని కిషన్ గంజ్ లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వంతెన ప్రారంభానికి ముందుగానే కొట్టుకుపోయింది. కింన్కాయీ నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన నీటి ఒత్తిడి కారణంగా కూలిపోయిందని తెలుస్తోంది. అయితే నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన కొట్టుకుపోవడం నాణ్యత లోపం కారణంగానే జరిగిందని అక్కడి ప్రజలు అరోపిస్తున్నారు. స్థానికి గోవాబారీ గ్రామంలో కింన్కాయీ నదిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పూర్తై త్వరలో ప్రారంభానికి కూడా సిద్దమైంది. అయితే ఈ వంతెనకు రెండు వైపులా అప్రోచ్ రోడ్డు నిర్మాణం కొనసాగుతోంది. ఈ పనులు పూర్తికాగానే ఈ వంతెన ప్రారంభానికి ప్రభుత్వం కూడా సిద్ధమైంది.
అకస్మాత్తుగా ఈ వంతెన కూలిపోవడంతో స్థానికులు నివ్వెరపోయారు. నూతనంగా నిర్మిస్తున్న ఈ వంతెన నాణ్యతను తప్పుబడుతున్నారు. ఈ వంతెన నిర్మిస్తున్న కాంట్రాక్టరు, అధికారులను బాధ్యల్ని చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ తో ప్రభుత్వం ఈ వంతెన నిర్మించగా అధికారుల అమ్యామ్యాల కారణంగా కాంట్రాక్లర కక్కుర్తి కారణంగా కోటిన్నర నిధులు నీటిలో కొట్టకుపోయాయని అరోపిస్తున్నారు, ఇక ఈ వంతెన కూలిపోవడంతో గ్రామస్తుల కష్టాలు మరింతగా పెరిగాయి. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కాగా కిషన్గంజ్ పరిధిలోని పలు ప్రాంతాలు వరదల కారణంగా నీట మునిగాయి. దీనికితోడు కన్కాయీ నదిలో నీటిమట్టం భారీగా పెరిగింది. ఈ కారణంగానే వంతెన కూలివుండవచ్చని భావిస్తున్నారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more