తెలంగాణ విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్తను వెలువరించింది. అసలే కరోనా నేపథ్యంలో పాఠశాలలు, విద్యా సంస్థలకు సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఇటీవలే ఈ ఏడాది దసరా, సంక్రాంతి సెలవులను కూడా కుదించి మొత్తం మీద కేవలం 182 రోజుల పాటు విద్యా సంవత్సరంలో తరగతులను నిర్వహిస్తుండగా, తాజాగా ఈ ఏడాది ఇంటర్ ప్రథమ, ద్వితీయ రెండు సంవత్సరాల్లో 30 శాతం పాఠ్యాంశాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు, అధ్యాపకులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాలని ఇంటర్మీడియట్ బోర్డు చేససిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది.
ఈ ఏడాది ఏకంగా 40 రోజుల పాటు విద్యార్థులు తరగతులను మిస్ అయ్యారు, దీంతో పాఠ్యాంశాలను తగ్గింపుతో అటు విద్యార్థులపై, ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించింది. కరోనా నేపథ్యంలో నష్టపోయిన పనిరోజులకు అనుగుణంగా ఈ పాఠ్యాంశాలను తగ్గించనున్నారు. సీబీఎస్ఈ మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులల్లో విధించిన కోతకు అనుగుణంగా రాష్ట్రంలోనూ ఇంటర్మీడియట్ లో కోత విధించనున్నారు. జేఈఈ మెయిన్, నీట్కు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే హ్యుమానిటీస్ కోర్సుల్లో ప్రాధాన్యం తక్కువగా ఉన్న పాఠాలను తొలగించనున్నారు.
సర్వసాధరణాంగా రెండు వందలకు పైగా వుండూ పనిదినాలు ఈ ఏడాది మాత్రం తగ్గిపోయాయి. గత ఏడాది 222 పనిదినాలు.. ఈ ఏడాది 40 రోజులు తగ్గించి, 182 రోజులుగా పరిమితం చేశారు. తొలిగించిన పాఠ్యాంశాల వివరాలకు సంబంధించి త్వరలోనే ఇంటర్మీడియట్ బోర్టు ప్రకటించనుంది. ఇదిలా ఉంటే మార్చిలో జరిగిన వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించి, పలు కారణాలతో పరీక్షలు రాయని 27వేల మంది విద్యార్థులను కూడా పాస్ చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more