కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై చూపుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. సీబిఎస్ఈ 10 తరగతి, 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో వాటి తరువాత నిర్వహించాల్సిన అన్ని ప్రవేశపరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. విద్యార్ధుల అరోగ్య భద్రతను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ కొత్త తేదీలను ప్రకటించారు.
సెప్టెంబర్ 1 - 6 తేదీల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు, సెప్టెంబర్ 27న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆ శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. అలాగే, సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆయన ట్విటర్లో తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు. వాస్తవానికి గత నెలలో జరగాల్సిన ఈ పరీక్షలు లాక్డౌన్తో కేంద్రం ఈ నెలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే, కొవిడ్ కేసులు దేశంలో మరింతగా పెరిగిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని నిపుణుల సూచనల మేరకు పరీక్షలను మరోసారి వాయిదావేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Keeping in mind the safety of students and to ensure quality education we have decided to postpone #JEE & #NEET examinations. JEE Main examination will be held between 1st-6th Sept, JEE advanced exam will be held on 27th Sept & NEET examination will be held on 13th Sept. pic.twitter.com/klTjtBxvuw
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 3, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more