కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ దేశ ప్రజలకు శుభవార్త అందించిన భారత దిగ్గజ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ పై అప్పుడే సోషల్ మీడియాలో విషం చిమ్మే కథనాలు పుట్టుకోచ్చాయి. ఆగస్టు 15 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. క్రియా రహిత వైరస్ ఆధారిత ఈ వ్యాక్సిన్, జంతువుల్లో పూర్తి సత్ఫలితాలను ఇవ్వగా, మానవులపై క్లినికల్ ట్రయల్స్ కు కూడా అనుమతి పోందింది.
ఇక హ్యూమన్ ట్రయల్స్ కూడా ప్రారంభించిన విషయాన్ని ఇవాళ ఉదయమే ప్రకటించాయి. దీంతో అప్పుడే ఈ సంస్థపై విషకథనాలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే ప్రచారాలకు వేదికలుగా మారిన సోషల్ మీడియాలో భారత్ బయోటెక్ సంస్థకు చెందిన అసత్యవార్తలు అలజడి సృష్టించాయి. తాజాగా కరోనా వ్యాక్సిన్ అంశంలోనూ మరోసారి నిరూపితమైంది. కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు ఐసీఎంఆర్ తో కలిసి పనిచేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ అందించగలమన్న ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం మానవులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
అయితే, భారత్ బయోటెక్ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ వీకే శ్రీనివాస్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ నర్సు ఆయన చేతికి ఇంజెక్షన్ గుచ్చుతున్నట్టుగా ఉన్న ఆ ఫొటో భారత్ బయోటెక్ సంస్థ దృష్టికి వచ్చింది. దాంతో ఆ పరిశోధక సంస్థ వెంటనే వివరణ ఇస్తూ, ఆ ఫొటో వాస్తవం కాదని, ప్రచారం అవుతున్న న్యూస్ ఫేక్ అని స్పష్టం చేసింది. అది తమ ప్రొడక్షన్ స్టాఫ్ కు నిత్యం నిర్వహించే వైద్య పరీక్షల కోసం రక్తం సేకరిస్తున్నప్పటి ఫొటో మాత్రమేనని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
— BharatBiotech (@BharatBiotech) July 3, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more