కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆకస్మాత్తుగా విధించిన లాక్ డౌన్ లో తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మధ్యలోనే వాయిదా పడ్డాయి. అయితే ఈ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అనుమతి కోరుతూ ప్రభుత్వం విన్నవించిన నేపథ్యంలో హైకోర్టు అనుమతులు ఇచ్చినా.. ప్రభుత్వం సమర్పించే నివేదిక మేరకు ఈ విషయంలో తుది నిర్ణయాన్ని గత శనివారం ప్రకటించింది. కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ పురపాలక సంఘంలో విద్యార్థులకు పరీక్షల నుంచి మినహాయింపు కల్పించింది. నగరంలో కరోనా శరవేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది.
జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో తప్ప మిగతా పిల్లలందరికీ సోమవారం నుండి పరీక్షలు జరగనున్నాయి. గ్రేటర్ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని ఆదేశించింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ గా గుర్తించాలని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని, విద్యాశాఖను అదేశించింది. దీంతో ఆదివారం పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక సోమవారం రోజున మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.
పరీక్షల సందర్భంగా విద్యార్థులకు కరోనా సోకితే బాధ్యులెవరని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో, పరీక్షలను నిర్వహించడం కంటే... విద్యార్థులను ప్రమోట్ చేయడం ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. పరీక్షలతో సంబంధం లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేశారు. ఇంటర్నల్స్, అసెస్ మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను పాస్ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో మొత్తం 5,34,903 మంది విద్యార్థులు తదుపరి క్లాసులకు వెళ్లనున్నారు. ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడులను నిర్ణయించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పదో తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పెద్ద టెన్షన్ తొలగిపోయింది. మరోవైపు, డీగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more