కఠిన లాక్ డౌన్ అమలు నేపథ్యంలో రెండో విడత వరకు నెమ్మెదిగా పయనించిన కరోనా వైరస్ మహమ్మారి మూడవ లాక్ డౌన్ లో సడలింపులతో వేగాన్ని పెంచింది. ప్రతీ రోజు సుమారు 3వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో దేశంలో కరోనా పంజా విసురుతుంది. దేశంలో అత్యధిక సంఖ్యలో వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ఇప్పటి వరకు ఒక్కరోజులో గరిష్ట సంఖ్యలో కేసులు నమోదు చేసుకున్న తరువాత రెండో గరిష్ట స్థాయిలో ఇవాళ తన ప్రభావాన్ని చాటింది. ఏకంగా మూడు వేల మార్కు దాటిన ఇవాళ కేసులు నమోదయ్యాయి. దీంతో అనేక మంది దేశస్థులు దాని ప్రభావం బారిన పడుతున్నారు, గడిచిన 24 గంటల్లో రెండో గరిష్టస్థాయిలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో 3561 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ స్థాయిలో కరోనా కేసులు ఒక్కరోజులో బయటపడటం ఇది రెండవసారి. రెండు రోజుల క్రితం అత్యధికంగా 3900 సంఖ్య నమోదైన తరువాత అస్థాయిలో మరోమారు పాజిటివ్ కేసులు నమోదు కావడడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53 వేల మార్కుకు చేరువలో వుంది. దేశవ్యాప్తంగా మొత్తం 52 వేల 952 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 89 మరణాలు సంభవించడంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1783కు చేరింది.
దీంతో వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 15,267 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 35,902 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 1233 మంది దీని ప్రబావం బారిన పడ్డారు. మహారాష్ట్రంలోనే ఏకంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 34 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రం మొత్తం మీద కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 16, 758కు చేరగా, 651 మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి.
తమిళనాడులోనూ మూడు రోజులుగా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 4829కి చేరుకోగా 35 మంది మరణించారు. తమిళనాడు రాజధాని చెన్నైలోనే కరోనా తీవ్రత అధికంగా వుంది. చెన్నైలోని కోయంబేడు మార్కట్ కేంద్రంలో తాజాగా కరోనా కేసులు అధికంగా వెలుగుచూడటంతో ప్రస్తుతం ఈ మార్కెట్ కరోనాకు కేరాఫ్ గా మారింది. అటు గుజారాత్ లోనూ నిన్న ఒక్కరోజులో 380 కేసులు నమోదుకాగా, మొత్తం కేసులు సంఖ్య 6625కు చేరగా, ఇప్పటి వరకు 396 మంది మరణించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more