India reaches 53000 Covid-19 cases దేశవ్యాప్తంగా 53 వేలకు చేరిన కరోనా కేసులు.. 1783 మరణాలు

Coronavirus update covid 19 cases in india reaches 53 000

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India witnessed its biggest jump in Coronavirus-linked cases today, with 3561 people testing positive for COVID-19 in the last 24 hours, government data showed. At least 53,000 people have tested positive for coronavirus and 1783 have died due to the virus.

దేశవ్యాప్తంగా 53 వేలకు చేరిన కరోనా కేసులు.. 1783 మరణాలు

Posted: 05/07/2020 11:12 AM IST
Coronavirus update covid 19 cases in india reaches 53 000

కఠిన లాక్ డౌన్ అమలు నేపథ్యంలో రెండో విడత వరకు నెమ్మెదిగా పయనించిన కరోనా వైరస్ మహమ్మారి మూడవ లాక్ డౌన్ లో సడలింపులతో వేగాన్ని పెంచింది. ప్రతీ రోజు సుమారు 3వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో దేశంలో కరోనా పంజా విసురుతుంది. దేశంలో అత్యధిక సంఖ్యలో వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ఇప్పటి వరకు ఒక్కరోజులో గరిష్ట సంఖ్యలో కేసులు నమోదు చేసుకున్న తరువాత రెండో గరిష్ట స్థాయిలో ఇవాళ తన ప్రభావాన్ని చాటింది. ఏకంగా మూడు వేల మార్కు దాటిన ఇవాళ కేసులు నమోదయ్యాయి. దీంతో అనేక మంది దేశస్థులు దాని ప్రభావం బారిన పడుతున్నారు,  గడిచిన 24 గంటల్లో రెండో గరిష్టస్థాయిలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల వ్యవధిలో 3561 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ స్థాయిలో కరోనా కేసులు ఒక్కరోజులో బయటపడటం ఇది రెండవసారి. రెండు రోజుల క్రితం అత్యధికంగా 3900 సంఖ్య నమోదైన తరువాత అస్థాయిలో మరోమారు పాజిటివ్ కేసులు నమోదు కావడడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53 వేల మార్కుకు చేరువలో వుంది. దేశవ్యాప్తంగా మొత్తం 52 వేల 952 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 89 మరణాలు సంభవించడంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1783కు చేరింది.

దీంతో వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 15,267 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 35,902 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 1233 మంది దీని ప్రబావం బారిన పడ్డారు. మహారాష్ట్రంలోనే ఏకంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 34 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రం మొత్తం మీద కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 16, 758కు చేరగా, 651 మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి.

తమిళనాడులోనూ మూడు రోజులుగా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 4829కి చేరుకోగా 35 మంది మరణించారు. తమిళనాడు రాజధాని చెన్నైలోనే కరోనా తీవ్రత అధికంగా వుంది. చెన్నైలోని కోయంబేడు మార్కట్ కేంద్రంలో తాజాగా కరోనా కేసులు అధికంగా వెలుగుచూడటంతో ప్రస్తుతం ఈ మార్కెట్ కరోనాకు కేరాఫ్ గా మారింది. అటు గుజారాత్ లోనూ నిన్న ఒక్కరోజులో 380 కేసులు నమోదుకాగా, మొత్తం కేసులు సంఖ్య 6625కు చేరగా, ఇప్పటి వరకు 396 మంది మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles