దేశంలో కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తోంది. దేశంలో అత్యధిక సంఖ్యలో విజృంభించిన ఒక్కరోజులోనే గరిష్ట సంఖ్యలో కేసులు నమోదు చేసుకున్న తరువాత రెండో గరిష్ట స్థాయిలో ఇవాళ తన ప్రభావాన్ని చాటింది. ఏకంగా మూడు వేల మార్కు చేరువలోకి ఇవాళ తన వ్యాప్తిని విస్తరించుకుంది. దీంతో అనేక మంది దేశప్రజలు దాని ప్రభావం బారిన పడుతున్నారు, గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశంలో మూడువ విడత లాక్ డౌన్ ను పలు సడలింపులతో అమల్లోకి తీసుకురావచ్చిన నాటి నుంచి వైరస మహమ్మారి వ్యాప్తి విస్తరణ పెరగడం గమనార్హం.
గడిచిన 24 గంటల వ్యవధిలో 2958 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ స్థాయిలో కరోనా కేసులు ఒక్కరోజులో బయటపడటం ఇది రెండవసారి. క్రితం రోజున అత్యధికంగా 3900 సంఖ్య నమోదు కావడడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్కుకు చేరువలో వుంది. దేశవ్యాప్తంగా మొత్తం 49 వేల 391 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 126 మరణాలు సంభవించడంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1694కు చేరింది. కరోనా బారిన పడిన బాధఇతుల్లో 14, 183 మంది కోలుకోగా 33,514 మంది మాత్రం ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు.
దీంతో వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 14,183 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో వెయి మందికి చేరువలో వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులో 984 కొత్త కేసులు నమోదు కావడం.. ఇక మరణాలు కూడా 34కు చెరడం అందోళన కలిగించే అంశం. దేశంలో రాష్ట్రం మొత్తం మీద కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 15, 525కు చేరగా, 617 మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి. అటు గుజారాత్ లోనూ కేసులు సంఖ్య 6245కు చేరగా, ఇప్పటి వరకు 368 మంది మరణించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more