ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతొంది. కాసింత నెమ్మదించిందని బావిస్తున్న తరుణంలో మళ్లీ ఈ మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ లింకుతో ముడిపడిన వారితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఏకంగా వెయ్యి మార్కుకు చేరువగా పయనిస్తోంది. తాజాగా నిన్న ఉదయం నుంచి ఇవాళ్టి ఉదయం వరకు రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 955 కి చేరుకుంది. ఇక తాజాగా కరోనా మరణాలు కూడా నమోదు కావడం అందోళన కలిగించే అంశం.
క్రితం రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఇవాళ ఉదయం పదకొండు గంటల వరకు కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 955కి చేరింది. ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండట ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో నిన్నటి వరకు 27 మంది మరణించగా, తాజాగా మరో ఇధ్దరు ఈ మహమ్మారి బారిన పడి అసువులు బాసారు. దీంతో ఇవాళ్టి ఉదయం వరకు మరణించిన వారి సంఖ్య ఏకంగా 29కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 145 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు.
ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలులో 27, గుంటూరు జిల్లాలో 11 కేసులు, అనంతపురంలో నాలుగు కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో రెండు కేసులు, కృష్ణలో పద్నాలుగు. ప్రకాశంలో మూడు, నెల్లూరులో ఒక్క కేసు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 955కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 781మంది చికిత్స పొందుతున్నారు. కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఇదివరకే ప్రభుత్వం అదేశాలను జారీ చేసింది.
జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 261 కేసులు నమోదు కాగా, తాజాగా మరో మరణంతో మొత్తంగా 8 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 206 కేసులు, ఎనమిది మరణాలు సంభవించాయి. నెల్లూరు-68 కేసులు రెండు మరణాలు, కృష్ణా-102 కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయి, ప్రకాశం - 53, పశ్చిమగోదావరి-39, చిత్తూరు-73, విశాఖపట్నం-22, కడప జిల్లాలో 51 కేసులు, అనంతపురం-42 కేసులు నాలుగు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యల్పంగా -34 కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more