తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లి నెమ్మదించింది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది అహర్నిశలు శ్రమించి చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలితానిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కేవలం 38 కరోనా కేసులు మాత్రమే పిర్యాదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజా పెరుగుదలతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 983కు చేరింది. కాగా, కరోనా బారినపడి కోలుకుని డిశ్చార్జ్ అయిన బాధితులు 291 కాగా, ప్రస్తుతం అసుపత్రులలో చికిత్స పోందుతున్నవారు 663 మందిని చెప్పారు. కాగా తాజా మరణాలతో మొత్తం మరణాల సంఖ్య కూడా 26కి చేరింది.
నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు 500లకు పైగా పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ అరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఇవాళ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల నుంచి ఎక్కువగా కరోనా కేసులు వచ్చాయని తెలిపారు, వికారాబాద్ లో 14 కుటుంబాల నుంచి కేసులు ఎక్కవగా వచ్చాయని, గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కోవిడ్ సోకిందని తెలిపారు. సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి వ్యాపించిందని, అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 44 కుటుంబాల నుంచి 260 మందికి కరోనా మహమ్మారి సోకిందని ఈటెల వివరించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో సికింద్రాబాదులోని గాంధీ అసుపత్రిని ఇకపై పూర్తి కోవిడ్ అసుపత్రిగా నామకరణం చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా రోగులకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు, రోగులకు అందించే ఆహారంపై కొందరు దుష్ఫ్రచారం చేస్తున్నారు. తమకు పౌకర్యాలు లేవని, రోగులెవరూ చెప్పలేదు. గాంధీ నుంచి డిశ్చార్జి అయినవారెవరూ అసంతృప్తిగా లేరని అన్నారు. కొన్ని చోట్ల వైద్యులు, సిబ్బందిని తమ ఇళ్ల వద్దకు రానివ్వడం లేదని.. వైద్యులపై దాడులు జరిగితే ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితిలో లేదని తేల్చిచెప్పారు. పది లక్షల పిపిఈ కిట్లు, పది లక్షల ఎన్ 95 మాస్కులు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో వైద్యులకు కరోనా ఎక్కడా సోకలేదని ఈటెల చెప్పారు.
తెలంగాణలో నమోదైన కరోనా కేసుల్లో అత్యదికం రాజధాని హైదరాబాద్ లోనే కావడం గమనార్హం. దీంతో కావడం గ్రేటర్ హైదరాబాద్ వాసులు కూడా తీవ్ర అందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో 354కి పైగా కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదు అయ్యాయి. హైదరాబాద్ తరువాత సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో అత్యధిక కోవిడ్ కేసులను నమోదు చేసుకున్నాయి. ఇవాళ కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ తాజా మరణాలు కూడా నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తంగా మృతుల సంఖ్య 26కు చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more