coronavirus cases reported to 983 in Telangana తెలంగాణలో నెమ్మదించిన కోరానా.. 24 గంటల్లో 38కేసులు..

38 new coronavirus cases reported in telangana as of 6 00 pm apr 24

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

38 new coronavirus cases were reported as of 6:00 PM on Apr 24 in Telangana, according to data released by the Ministry of Health and Family Welfare. This brings the total reported cases of coronavirus in Telangana to 983. Among the total people infected as on date, 291 have recovered and 25 have passed away.

తెలంగాణలో నెమ్మదించిన కోరానా.. 24 గంటల్లో 38 కేసులు..

Posted: 04/24/2020 06:54 PM IST
38 new coronavirus cases reported in telangana as of 6 00 pm apr 24

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లి నెమ్మదించింది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది అహర్నిశలు శ్రమించి చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలితానిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కేవలం 38 కరోనా కేసులు మాత్రమే పిర్యాదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజా పెరుగుదలతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 983కు చేరింది. కాగా, కరోనా బారినపడి కోలుకుని డిశ్చార్జ్ అయిన బాధితులు 291 కాగా, ప్రస్తుతం అసుపత్రులలో చికిత్స పోందుతున్నవారు 663 మందిని చెప్పారు. కాగా తాజా మరణాలతో మొత్తం మరణాల సంఖ్య కూడా 26కి చేరింది.  

నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు 500లకు పైగా పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ అరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఇవాళ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల నుంచి ఎక్కువగా కరోనా కేసులు వచ్చాయని తెలిపారు, వికారాబాద్ లో 14 కుటుంబాల నుంచి కేసులు ఎక్కవగా వచ్చాయని, గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కోవిడ్ సోకిందని తెలిపారు. సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి  83 మందికి వ్యాపించిందని, అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 44 కుటుంబాల నుంచి 260 మందికి కరోనా మహమ్మారి సోకిందని ఈటెల వివరించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో సికింద్రాబాదులోని గాంధీ అసుపత్రిని ఇకపై పూర్తి కోవిడ్ అసుపత్రిగా నామకరణం చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా రోగులకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు, రోగులకు అందించే ఆహారంపై కొందరు దుష్ఫ్రచారం చేస్తున్నారు. తమకు పౌకర్యాలు లేవని, రోగులెవరూ చెప్పలేదు. గాంధీ నుంచి డిశ్చార్జి అయినవారెవరూ అసంతృప్తిగా లేరని అన్నారు. కొన్ని చోట్ల వైద్యులు, సిబ్బందిని తమ ఇళ్ల వద్దకు రానివ్వడం లేదని.. వైద్యులపై దాడులు జరిగితే ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితిలో లేదని తేల్చిచెప్పారు. పది లక్షల పిపిఈ కిట్లు, పది లక్షల ఎన్ 95 మాస్కులు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో వైద్యులకు కరోనా ఎక్కడా సోకలేదని ఈటెల చెప్పారు.

తెలంగాణలో నమోదైన కరోనా కేసుల్లో అత్యదికం రాజధాని హైదరాబాద్ లోనే కావడం గమనార్హం. దీంతో కావడం గ్రేటర్ హైదరాబాద్ వాసులు కూడా తీవ్ర అందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో 354కి పైగా కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదు అయ్యాయి. హైదరాబాద్ తరువాత సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో అత్యధిక కోవిడ్ కేసులను నమోదు చేసుకున్నాయి. ఇవాళ కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ తాజా మరణాలు కూడా నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తంగా మృతుల సంఖ్య 26కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles