దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,007 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 23 మంది మరణించారని పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 13,387కి చేరిందని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 1749 మంది కోలుకున్నారని చెప్పారు. ఇది 13.06 శాతంతో సమానమని పేర్కొన్నారు. ప్రతి 24 శాంపిళ్లలో 1 కరోనా పాజిటివ్ కేసు నమోదవుతోందని తెలిపారు.
లాక్డౌన్కు ముందు దేశంలో కేసుల సంఖ్య రెట్టింపు అవ్వడానికి కేవలం మూడు రోజులు మాత్రమే పట్టేదని లవ్ అగర్వాల్ తెలిపారు. లాక్డౌన్ కాలంలో గత 7 రోజుల డేటాను పరిశీలిస్తే కేసుల రెట్టింపునకు కనీసం 6.2 రోజులు పడుతోందని చెప్పారు. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసుల రెట్టింపు సరాసరి జాతీయ సగటు కంటే తక్కువగా ఉందన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్తో పాటు, కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ, బిహార్, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 5 లక్షల యాంటీబాడీ టెస్ట్ కిట్లను రాష్ట్రాలకు అందజేసినట్లు వివరించారు.
కొవిడ్-19 కారణంగా కోలుకుంటున్న వారి సంఖ్య, మరణిస్తున్న వారి నిష్పత్తి 80:20గా ఉందని లవ్ అగర్వాల్ తెలిపారు. కొన్ని దేశాలతో పోల్చినప్పుడు ఈ విషయంలో మెరుగైన స్థితిలో ఉన్నామని వివరించారు. దేశవ్యాప్తంగా కొవిడ్-19 కోసం ప్రత్యేకించిన 1919 ఆసుపత్రుల్లో 1.73 లక్షల ఐసోలేషన్ బెడ్లు, 21,800 ఐసీయయూ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 3,19,400 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, గురువారం ఒక్కరోజే 28,340 టెస్టులు నిర్వహించామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రవేత్త గంగా ఖేడ్కర్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more