తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికీ 11 మంది రాష్ట్రవాసులను పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి.. రాష్ట్రంలో అనేక మందిని తన ప్రభావానికి గురిచేస్తోంది. చూపుతోంది. దీంతో తెలంగాణలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా మరో 62 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల 334కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. శనివారం వరకు తెలంగాణలో 272 కేసులు నమోదుకాగా... మరో 24 గంటల్లో ఆ సంఖ్య మరింత పెరిగింది.
ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో తబ్లీగి జమాత్ ప్రార్థనలకు హాజరై తిరిగివచ్చిన వారితో తెలంగాణలో బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో నిన్న 480 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 62 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 334కు పెరిగింది. ఇప్పటికే మరణించిన 11 మందిలో రమారమి అందరూ మర్కజ్ లింకు వున్నవారేనని సమాచారం. కాగా, మరో 33 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో వారిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 283 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయితే ఇవాళ మరో 600 మందికి పరీక్షలు నిర్వహించే అవకాశముంది.
హైదరాబాదులోనే కరోనా పాజిటివ్ కేసులు అధికం
ప్రస్తుతం తెలంగాణలోని 334 యాక్టివ్ కేసుల్లో.... హైదరాబాద్ బాధితులే ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్లో ఇప్పటి 162 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఒకరోజు వ్యవధిలోనే 51 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. 11 మంది డిశ్చార్జి అయ్యారు. హైదరాబాద్ తర్వాత ప్లేస్లో వరంగల్ అర్బన్ నిలిచింది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఇప్పటి వరకు 23 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నిజామాబాద్లో 19 మంది, నల్లగొండలో 13మంది, మేడ్చల్లో 12మంది, రంగారెడ్డిలో 11మంది, ఆదిలాబాద్లో 10మంది కరోనా బారిన పడ్డారు.
కాగా తాజాగా నమోదైన కేసుల్లో ఆదిలాబాద్ 10, భద్రాద్రి 3, జగిత్యాల 02, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 1, జోగులాంబ గద్వాల 5, మహబూబ్నగర్ 01, నాగర్కర్నూలు 2, నిర్మల్ 1, నిజామాబాద్ 19, పెద్దపల్లి 1, సంగారెడ్డి 7, సిద్దిపేట1, సూర్యాపేట2, వికారాబాద్ 4, ములుగు 2 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలావుండగా, గత నాలుగు రోజుల వ్యవధిలోనే 190 కేసులు నమోదయ్యాయి. మార్చి 31న 15 కేసులు, ఏప్రిల్ 1 నుంచి వరుసగా భారీగా కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో ఏకంగా ఒకేరోజు 75 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా మర్కజ్తో సంబంధముండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
మార్చి 26 నుంచి రాష్ట్రంలో ఢిల్లీతో కనెక్ట్ అయిన కరోనా కేసులు బయటపడుతూ వస్తున్నాయి. దేశమంతా లాక్డౌన్ విధించే సమయానికి తెలంగాణలో ఐదారు జిల్లాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఐదారు రోజులుగా వరుసగా దాదాపు అన్ని జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. మున్ముందు మిగిలిన జిల్లాల్లో కూడా కేసులు నమోదయ్యే అవకాశం కన్పిస్తోంది. ప్రస్తుతం నమోదయ్యే కేసులన్నీ కూడా మర్కజ్తో సంబంధమున్నవేనని తేలింది. పైగా అక్కడికి వెళ్లి వచ్చిన వారి కుటుంబాలకే కాకుండా ఇతరులకు కూడా ఇది సోకుతోంది. దాంతో కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more