ఇండియాలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి నేటికి సరిగ్గా రెండు నెలలు. ఫిబ్రవరి 1న తొలి కేసు నమోదైంది. కాగా, ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మార్చి 22 నాటికి కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో ధైర్యంగా వున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం రాష్ట్రంలో విజృంభిస్తోన్న వైరస్ మహమ్మారిని చూసి అందోళన చెందుతోంది. అయితే ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ మర్కజ్ మసీదులోని తబ్తిగి జమాత్ కు వెళ్లివచ్చిన వారితో ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల వివరాలను వెల్లడిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 20 చొప్పున, ప్రకాశం జిల్లాలో 17, కడప, కృష్ణా జిల్లాల్లో 15 చొప్పున , పశ్చిమగోదావరి జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 9 అనంతపురంజిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1800 మంది నమూనాలు పరీక్షించగా.. 1175 మందికి నెగిటివ్గా నిర్ధారణ అయింది. 493 మంది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
మంగళగిరిలోని టిప్పర్ల బజార్లో ఓ వ్యక్తి(65)కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అతని నివాసం నుంచి 3కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. కరోనా పాజిటివ్ కేసుతో సమీపంలోని దుకాణాలు, కూరగాయల మార్కెట్లను మూసివేయించారు. 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించి ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. ఆ ప్రాంతమంతా హైఅలర్ట్ ప్రకటించామని కమిషనర్ వెల్లడించారు. దిల్లీలో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారిక సమాచారం. అలాగే, విదేశాల నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారూ వీరిలో ఉన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more