ప్రపంచవ్యాప్తంగా కళారా నృత్యం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ప్రభుత్వాలు అప్రమత్తమై ప్రజలు బయటకు రాకుండా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జనతా కర్ఫ్యూను విధించి.. ఆ తరువాత ఏకంగా ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించి.. ప్రజారోగ్యం పరిరక్షించాలని, కరోనా మహమ్మారిని భారత్ నుంచి తరిమి కొట్టాలని ప్రయత్నాలు చేస్తూనే వున్నా తెలంగాణలో మాత్రం ఈ వైరస్ వ్యాప్తి దడ పుట్టిస్తోంది. యావత్ దేశం జనతా కర్ఫ్యూ పాటించిన రోజే.. తెలంగాణలో ఆరు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కోవిడ్-19 కేసులు 27కు చేరుకున్నాయి.
ఇప్పటికే ఒకరు కోలుకోగా.. మరో 26 మంది మాత్రం చికిత్స పొందుతున్నారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని.. కేవలం ఒకే ఒక్కరికి ప్రైమరీ కాంటాక్ట్ (కరోనా బాధితుడి నుంచి మరొకరికి సోకడం) ద్వారా వైరస్ సోకిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే కరోనా రాదని ప్రతి ఒక్కరు అందుకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అందరూ వ్యక్తులు విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.
ఇక తాజాగా కరోనా వ్యాధి పాజిటివ్ గా నమోదైన ఆరు కేసుల్లో నలుగురు వ్యక్తులు ముఫై ఏళ్ల లోపు వారు కావడం, మరోకరు 35 ఏళ్లకు మించివుండకపోవడంతో ఈ వ్యాధి అన్ని కేవలం వృద్దలు, చిన్నారులపైనే అధికా ప్రభావం చూపుతుందన్న వార్తల్లో నిజం లేదని, అన్ని వయస్సుల వారిపై ఇది ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక మరో పాజిటివ్ కేసులో బాధితురాలు యాభై ఏళ్ల మహిళ కావడం.. అమె కూడా విదేశాల నుంచి ఈ నెల 14న హైదరాబాద్ కు రావడంతో అమెకు ఈ వైరస్ సోకింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more