ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ బారి నుండి తమ దశస్థులను రక్షించుకునే పనిలోభాగంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముందస్తు నివారణ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా యూరప్ లోని అన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధాన్ని విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. శుక్రవారం ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నట్లు కూడా తెలిపారు. ఏకంగా 30 రోజుల పాటు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని వైట్ హౌస్ ప్రకటించింది. "ఇది కాస్తంత కఠినమైన నిర్ణయమే అయినా, తప్పనిసరి" అని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
యూకే వ్యాప్తంగా 460 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఇటలీలో వైరస్ విజృంభించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ నిషేధాజ్ఞాలు బ్రిటన్ కు వర్తించవని కూడా ఆయన తన ఆదేశాల్లో పేర్కెన్నారు. ఇదే సమయంలో అగ్రరాజ్యవాసులకు మరో శుభవార్తనందించాడు. అగ్రరాజ్యంలోని హెల్త్ ఇన్యూరెన్స్ కంపెనీలు కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు కూడా చికిత్సను అందించేందకు ముందుకువచ్చాయని ఆయన ప్రకటించారు. ఇక ఈ వ్యాధిభారిన పడి గృహనిర్భంధంలోనే ఉండాల్సివచ్చిన రోగులకు త్వరలోనే తాను అర్థిక సాయాన్ని కూడా ప్రకటిస్తానని తెలిపారు.
ఉద్దీపన ప్రకటించిన బ్రిటన్
ఇక కరోనా కారణంగా అర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఆర్థిక సవాళ్లను ఎదుర్కోనేందుకు ఏకంగా రూ.3లక్షల కోట్లతో ఉద్దీపన ఫ్యాకేజీని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థకు ఊపు తీసుకువచ్చేందుకు ప్రజలు వినియోగం, వ్యవయాలను పెంచేందుకు వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. దీనికి సంబంధించిన బ్రిటన్ అర్థిక మంత్రి ఆ దేశ కేంద్రీయ బ్యాంకుకు అధికారులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను ఇరువర్గాలు వేర్వురుగా ప్రకటించాయి.
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థైన బ్రిటన్ కుదేలవుతుందని ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునక్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితి నెలకొందని.. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయని చెప్పారు. అయితే ఇదంతా తాత్కాలికమేనని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా 3,900 కోట్ల డాలర్లతో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని అమలు చేయనున్నట్టు ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more