యావత్ ప్రపంచాన్ని భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్ నగరంలో కూడా జడలు విప్పుతోంది. దుబాయ్ నుంచి బెంగళూరుకు వెళ్లి.. అక్కడి నుంచి హైదరాబాద్ కు బస్సులో వచ్చిన ఓ సాప్ట్ వేర్ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన తెలంగాణ ప్రభుత్వ వైద్యఅరోగ్య శాఖ అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ పేషంటును గాంధీ అసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి అక్కడి అతనికి చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. అతను నివసించే మహేంద్రహిల్స్ కాలనీ, బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు, ఇలా అందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.
ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో కరోనా వైరస్ అలజడి సృష్టిస్తోంది. మరో ఇద్దరిలో వైరస్ లక్షణాలను గుర్తించారు. గాంధీ మెడికల్ కాలేజీలోని ఐసీఎమ్ఆర్ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరి రిపోర్టులు పాజిటివ్గా వచ్చాయి. దాంతో, వారి శాంపిల్స్ను తదుపరి పరీక్షల కోసం పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలాజీ (ఎన్ఐవీ)కి పంపించారు. గురువారం ఎన్ఐవీ నుంచి రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. ఎన్ఐవీలో కూడా పాజిటివ్ అని తేలితే ఆ ఇద్దరికీ కరోనా సోకిందని నిర్ధారిస్తారు.
ఈ ఇద్దరిలో ఒకరు వైరస్ బారిన పడిన సాఫ్ట్వేర్ ఉద్యోగితో కాంటాక్ట్ అయిన వ్యక్తి కాగా, మరొకరు ఇటలీకి వెళ్లొచ్చినట్టుగా గుర్తించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగితో కాంటాక్ట్ అయిన వారితో సహా మంగళవారం మొత్తం 47 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు చేయగా 45 మంది రిపోర్టులు నెగిటివ్గా వచ్చాయి. వాళ్లందరినీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని, 14 రోజుల పాటు తమ నివాసాల్లో ఐసోలేషన్లో ఉండాలని సూచించినట్టు గాంధీ ఆసుపత్రి ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస్ రావు తెలిపారు. ఇక, కరోనా బారిన పడి గాంధీ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న సాప్ట్వేర్ ఉద్యోగి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more