కలియుగ ప్రత్యక్ష దైవం.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి ఏడు కొండలపై విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఈ చర్యలతో తిరుమల కొండపై వున్న భక్తులు ఆందోళనకు గురయ్యారు. రెండు రోజులుగా విమానం ఆలయం మీదుగా వెళ్లడంతో టీటీడీ అధికారులు, విజిలెన్స్, భద్రతాధికారులు, సిబ్బంది, భక్తులు అందరూ ఉలిక్కి పడ్డారు. తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానం ఎలా వెళ్లిందని భక్తులు మండిపడుతున్నారు. విమానాశ్రయ అధికారులు తిరుమల కొండల మీదుగా విమానం వెళ్లేందుకు ఎలా అనుమతించారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
అయితే విమానం వెళ్లిందని భక్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఫిర్యాదు చేశారు. ఈ విమానం నేషనల్ సర్వే అఫ్ ఇండియాకు చెందినదగా గుర్తించి.. కేవలం భౌగోళిక పరిస్థితుల అధ్యయనానికి మాత్రమే విమానం వచ్చిందని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానం తిరిగిందని, ఇది ఆగమశాస్త్రానికి విరుద్దమని ఇలా విమానాలు ఎలా వెళ్తాయని పండితులు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలను ఎన్నో ఏళ్ల క్రితమే నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారని గుర్తు చేశారు.
ఇలాంటి స్పష్టమైన నిబంధనలు వున్న తరువాత కూడా చెన్నై ఎయిర్ ట్రాఫికింగ్ అధికారులు సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన విమానానికి శ్రీవారి కొండల మీదుగా వెళ్లేందుకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నలు సర్వత్రా వినబడుతున్నాయి. శ్రీవారి ఏడు కొండలకు ఉన్న ప్రాశస్త్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు భక్తులు మండిపడతున్నారు. గతంలో కూడా ఇలాగే శ్రీవారి ఆలయం మీదుగా పలు సందర్భాలలో విమానాలు వెళ్లగా.. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుల నేపథ్యంలో బ్రేకులు పడ్డాయని భక్తులు తెలిపారు. టీటీడీ ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ఛైర్మన్ పదవికి సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవిలో కొనసాగుతున్న సినీనటుడు వృథ్వీపై ఛానల్ ఉద్యోగిని పలు అరోపణలు చేయడంతో ఆయనను ఛానల్ చైర్మన్ పదవి నుంచి పక్కన బెట్టిన ప్రభుత్వం.. ఈ ఛానెల్ మెనేజింగ్ డైరెక్టర్ పదవికి టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయన ఇవాళ ఎస్వీబిసి ఛానెల్ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ధర్మారెడ్డి ప్రస్తుతం టీటీడీ అడిషనల్ ఈవోగా ఉన్నారు.. దీనితో పాటూ ఎస్వీబీసీ ఛానల్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more