రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ బిల్లును తక్షణం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత 50 రోజులుగా అమరావతి ప్రాంత రైతుల అందోళనలు చేపడుతున్నారు. అమరావతిలోనే పూర్తిస్థాయి రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. రాజధానిని తరలిస్తున్నారన్న సంకేతాలు వచ్చిన రోజు నుంచే అమరావతి పరిధిలోని 29 గ్రామాల పరిధిలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనదీక్షలలో స్థానిక రైతులతో పాటు మహిళలు, యువకులు, విద్యార్థులు పాల్గోని తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.
మందడం, తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెంలో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణాయపాలెంలో కులవృత్తులతో వినూత్న నిరసన తెలిపారు. ‘‘వద్ద వద్దు మాకు వద్దు మూడు రాజధానులు మాకు వద్దు’’ అన్న ప్లకార్డులు తమ ఎదుట పెట్టుకున్న రైతులు కులవృత్తులను అచరిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో మొత్తం ఒక కులం వారే వున్నారన్న అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలను తమ కులవృత్తులతో సమాధానం చెబుతూ ఆ ప్రాంత రైతులు అందోళనను చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఇక్కడ సేకరించిన భూమిని తీసుకుని పూర్తిస్థాయి రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం పెద్దన్నగా జోక్యం చేసుకుని రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చూడాలని కోరారు. రాజధాని రైతుల ఆందోళనలు నేటికి 50వ రోజుకు చేరడంతో వారిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. రాయపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండలో ఇవాళ చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.
ఇక అమరావతి ప్రాంతంలోనే ఏకైక రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. దీక్షల్లో పాల్గోన్న పలువురు రైతులు తీవ్ర మనస్తాపానికి గురై అసువులు బాసిన విషయం తెలిసిందే. తాజాగా క్రితం రోజున మరో రైతు గుండె కూడా ఏకంగా దీక్షాస్థలిలోనే ఆగింది. రాజధానిని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. అందోళనా కార్యక్రమాలలో పాల్గోనేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిన హనుమంతరావు (72) అనే రైతు క్రితం రోజున దీక్షస్థలిలోనే గుండెపోటుకు గురై మరణించారు. హైదరాబాద్ నుంచి తూళ్లూరు వెళ్లిన హనుమంతరావు దీక్షలో పాల్గోంటూ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. నిరసనకారులు వెనువెంటనే ఆయనను అస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more