ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు చేసేందుకు చర్చిలు, మసీదులు, దేవాలయ భూములు అమ్ముకోవచ్చని ప్రభుత్వం జీవో ఇచ్చిందన్న టీడీపీ యువనేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యలపై శాసనమండలిలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన నిరూపించాలని బుగ్గన సవాల్ విసిరారు. నవరత్నాలు అమలు చేయలేని స్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు.
అయినా ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ తన వ్యాఖ్యలను నిరూపించాలని, ఈ క్రమంలో కనీసం ఆ జీవో నెంబరును చెప్పినా చాలునని అన్నారు. ప్రభుత్వం మసీదులు, చర్చిలు, దేవాలయాల భూములు అమ్ముకోవచ్చని ఎప్పుడూ జీవో జారీ చేయలేదని బుగ్గన స్పష్టం చేశారు. అదే నిజమైతే.. ఆ జీవో ఎక్కడుందో చూపించాలని సవాల్ విసిరారు.. లేనిపక్షంలో సభకు నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు.
అంతకుముందు నారా లోకేష్ తన ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై వీడియో రూపంలో విమర్శలు గుప్పించారు. అమరావతి నుండి రాజధానిని తరలింపుపై సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించారు. అభివృద్ధిపై ఓ సామాన్య యువకుడి అభిప్రాయాలను వీడియో రూపంలో ట్వీట్ చేశారు. ఆ యువకుడికి ఉన్న తెలివిలో అణువంతనైనా జగన్ కు ఉండుంటే ఈ దౌర్భాగ్యపు స్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. ఆ వీడియోలో మాట్లాడిన యువకుడు రాజధాని, అభివృద్ధిపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెలిబుచ్చాడు.
ఓ ప్రభుత్వ ఆఫీసు తరలించినంత మాత్రాన అక్కడ అభివృద్ధి జరగదని, అందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ ఉదాహరణ అని తెలిపాడు. తమ చిన్నప్పటి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ అలాగే ఉన్నాయని, ఇకముందూ అలాగే ఉంటాయని, కానీ నిన్నమొన్న వచ్చిన సైబరాబాద్, హైటెక్స్ భారీస్థాయిలో అభివృద్ధి చెందాయని వివరించాడు. అక్కడ ప్రయివేటు సంస్థలు భారీగా రావడంతో ఉద్యోగాల కల్పన కూడా అదే స్థాయిలో జరిగిందని, తద్వారా అత్యంత వేగంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఆ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నాడు.
ఈ యువకుడికి ఉన్న తెలివిలో ఒక అణువంతైనా జగన్ గారికి ఉంటే ఈ దౌర్భాగ్యపు స్థితి ఉండేది కాదు (Part 1)#SaveAmaravati#MyCapitalAmaravati #APWithAmaravati pic.twitter.com/uNbvOQATw0
— Lokesh Nara (@naralokesh) January 22, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more