ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. మూడు రాజధానులతో అభివృద్ది జరగదని చేతులు జోడించి అడుగుతున్నాను అర్థం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు క్రితం రోజున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఆ తరువాత సభలో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో ఆయన కూడా వాకౌట్ చేశారు. అయితే ఇలా వాకౌట్ చేసిన తరువాతే అసలు హైడ్రామా సాగిందని టీడీపీ శ్రేణులు అరోపిస్తున్నారు. తమ అధినేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు గంటల పాటు డొంక రోడ్లతో తిప్పారని అరోపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. అర్థరాత్రి పోలీసులు హైడ్రామాకు తెరతీసారని, ఇందుకు వెలగపూడి సచివాలయం మౌనసాక్షిగా మారింది. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తరువాత, చంద్రబాబు, తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెలగపూడి నుంచి మందడం వరకూ పాదయాత్రను తలపెట్టగా, పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో సీఎం కాన్వాయ్ వెళ్లనున్న కారణంగా పాదయాత్రకు, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో, వారితో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. తాను పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడిన రైతులను పరామర్శించేందుకు వెళుతున్నానని, తనను ఎందుకు అడ్డుకుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.
కాగా అదే సమయానికి అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం ముగియడంతో, ఆయన అదే దారిపై వస్తారని ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు, చంద్రబాబును, ఇతర నేతలను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, వ్యాన్ ఎక్కించారు. ఆపై చంద్రబాబును ఆయన ఇంటి సమీపం వరకూ తీసుకెళ్లిన తరువాత, కిలోమీటర్ దూరంలో వ్యాన్ దారి మళ్లించారు. రెండు గంటల పాటు డొంక రోడ్డు, ఇతర దారుల్లో 20 కిలోమీటర్లకు పైగా తిప్పారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి కరకట్టవైపు కాకుండా వెంకటపాలెం వైపు వాహనాన్ని పోనిచ్చారు. ఆపై మళ్లీ మందడం పక్కనున్న కృష్ణాయపాలెంవైపు తీసుకెళ్లారు.
డొంకరోడ్డు గతుకుల్లో 3 కిలోమీటర్ల ప్రయాణం తరువాత, కృష్ణాయపాలెం నుంచి ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వైపు తీసుకెళ్లారు. మంగళగిరి వీధుల్లో తిప్పుతున్న సమయంలో వ్యాన్ ను బలవంతంగా ఆపించి, కిందకు దిగిన ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి, స్వామి తదితరులు నడిరోడ్డుపై బైఠాయించి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆపై చంద్రబాబు మరోసారి పాదయాత్రను తలపెట్టగా, పోలీసులు మంగళగిరి పోలీసు స్టేషన్ వద్ద అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతించేది లేదని స్పష్టం చేస్తూ, పీఎస్ నుంచి ఆయన కాన్వాయ్ లోనే చంద్రబాబును ఇంటికి పంపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more