దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ లో కొత్త ట్విస్టు నెలకొంది. జాతీయ మానవహక్కుల సంఘం సభ్యులు వచ్చి నిందితుల కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించిన క్రమంలో నిందితుల్లో ఇద్దరు మైనర్లని తేలింది. ఈ విషయంలో ఎన్ కౌంటర్ జరిగిన తరువాత పోలీస్ కమీషనర్ వెలువరించిన వివరాల్లో నిజం లేదని స్పష్టం అవుతోంది. ఈ వివరాలను ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు ఆదారాలతో పాటు సేకరించారని తెలుస్తోంది. ఎన్ కౌంటర్ లో హతమైన ప్రధాన నిందితుడు మహమ్మద్ ఆరిఫ్ వయస్సు 26గా, జోల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు వయస్సు 20 అని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ తెలిపారు.
కాగా నిందితుల్లో ఇద్దరు మైనర్లు వున్నారని వారి పుట్టిన రోజు తేదీలను బట్టి తెలుస్తొందని, ఇదే విషయాన్ని నిందితులు తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘం విచారణ బృందానికి కూడా వివరించి.. తగు ఆదారాలను కూడా సమర్పించారని సమాచారం. మైనర్లైన తమ బిడ్డలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయం నుంచి ఎన్ కౌంటర్లో హతమార్చే సమయం వరకు అంతా పోలీసుల డైరెక్షన్ లో నడిచిందని, ఈ వ్యవహారంలో కనీసం తమను తమ బిడ్డలతో మాట్లాడించలేదని నిందితుల తల్లిదండ్రులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు నిందితుల ఆధార్ కార్డులు, పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్లను అధికారులు సేకరించారు. వాటి ప్రకారం ఓ నిందితుడి పుట్టిన రోజు ఆగస్టు 15, 2002. దాని ప్రకారం అతడి వయసు 17 సంవత్సరాల ఆరు నెలలు. అయితే, ఆధార్కార్డులో మాత్రం 2001గా నమోదైంది. మరో నిందితుడి పుట్టిన తేదీ ధ్రువపత్రంలో 10 ఏప్రిల్ 2004గా ఉంది. అంటే అతడి వయసు 15 సంవత్సరాల 8 నెలలు మాత్రమే. దీంతో నిందితుల వయసుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు లారీ డ్రైవర్లు అని పోలీసులు పేర్కొన్నారు. అయితే, వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more