అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పుల మోతలు ధద్దరిల్లాయి. సాధారణంగా పాఠాశాల్లో లేదా విశ్వవిద్యాలయాల్లో లేదా పనిచేసే చోట మాత్రమే కలకలం రేపే కాల్పులు.. ఈ సారి ఏకంగా నావికా దళంలో మార్మోగాయి. దీంతో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి భద్రతా దళాలు, ప్రజల వరకు అందరూ ఈ కాల్పులపై అందోళనకు గురయ్యారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రాంతంలో గల పెన్సాకోలా నావల్ ఎయిర్ స్టేషన్ లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పులలో నలుగురు నావికాధళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
పెన్సాకోలా నౌకాశ్రయం ఎయిర్ స్టేషన్ లో శిక్షణ పోందుతున్న సౌదీ ఎయిర్ ఫోర్స్ అధికారి కాల్పులకు తెగబడ్డాడని అధికారులు తెలిపారు. ముగ్గురు శిక్షకులు చనిపోగా, కాల్పులు జరిగిన అధికారిపై వెంటనే ప్రతిస్పందించిన పోలీసులు కాల్పులు జరిపడంతో ఆయన కూడా చనిపోయాడని పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన సౌదీకి చెందిన అధికారిని.. మహమ్మద్ సయీద్ అలమ్రాణి గా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. అయితే ఈ కాల్పులకు వ్యక్తిగత నేపథ్యంలో సాగినవా లేక ఉగ్రవాదం నేపథ్యంలో జరిగినవా.? అన్న విషయాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇక ఈ ఘటనను మరో ముగ్గురు అధికారులు తమ సెల్ ఫోన్లో చిత్రీకరించడం కనిపించిందని, వీరు కాకుండా మరో ముగ్గురు కూడా సౌదీ విద్యార్థులు అక్కడే శిక్షణ పోందుతున్నారని పోలీసులు తెలిపారు. కాగా ఘటనను చిత్రీకరించిన ముగ్గురిని కూడా తాము అదుపులోకి తీసుకున్నామని.. వారిని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే వీరికి ఉగ్రవాదానికి మధ్య ఏమైనా సంబంధాలు వున్నాయా అన్న కోణంపై అధికారుల దర్యాప్తు సాగుతుందని సమాచారం. కాగా, ఈ కాల్పుల్లో మరో ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు.
కాల్పుల ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ ఘటనను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? అన్న విషయంపై ఏమీ మాట్లాడని ఆయన.. మృతుల కుటుంబాలకు తాము అండగా వుంటామని చెప్పారు. ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని.. దర్యాప్తులో పూర్తైన తరువాత మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. కాగా ఈ ఘటనపై ప్లోరిడా గవర్నర్ రాన్ డి సాన్టిస్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more