కాచిగూడ రైల్వేస్టేషన్లో ఇవాళ ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి సిర్ పూర్ కాగజ్ నగర్ కు వెళ్లే హంద్రీ ఎక్స్ ప్రెస్ (కర్నూలు ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్) రైలును వెనుకగా వచ్చిన ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. కర్నూల్ ఇంటర్ సిటీ రైలులో సాంకేతిక లోపం తలెత్తడంతో స్టేషన్ లో ఓ ట్రాక్ పై నిలిపిఉంచారు. ఫలక్ నుమా నుంచి కాచిగూడకు బయల్దేరిన ఎంఎంటీఎస్ రైలు కూడా అదే ట్రాక్ పైకి రావడంతో నిలిపి ఉంచిన రైలును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ రైలు ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అసుపత్రులకు తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన ఎంఎంటీఎస్ పైలట్ ఎంతోగానో ప్రమాదం జరగకుండా నియంత్రించినందు వల్లే ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. అయితే తన శాయశక్తులా ప్రమాద నివారణ కోసం చర్యలు తీసుకున్న ఎంఎంటీఎస్ పైలట్ మాత్రం రైలు ఇంజన్లో చిక్కుకున్నాడు. ప్రాణాపాయం నుంచి ఆయన బయటపడినప్పటికీ, తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.
కోచ్ లో చిక్కకుపోయి తీవ్ర గయాలతో బాధపడుతున్న ఆయన.. ప్రయాణికులతో పాటు రైలు సిబ్బందిని తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తుండటం చూపరులను కలచివేస్తోంది. కోచ్ లో ఉన్నఆయనకు ఆక్సిజన్ అందించడంతో పాటు సెలైన్ ఎక్కిస్తున్నారు. మరోవైపు, ఆయను కోచ్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రైల్వే సిబ్బంది తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మెటల్ తో తయారుకాబడిన కోచ్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. మరో 30 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఒక ట్రాక్ పై కర్నూలు ఇంటర్సీటీ రైలును నిలిపి ఉంచిన తర్వాత.. అదే ట్రాక్ పైకి వచ్చేందుకు ఎంఎంటీఎస్ రైలుకు సిగ్నల్ ఎలా ఇస్తారని ప్రయాణికులు రైల్వే అధికారులను నిలదీశారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని.. ప్రాణ నష్టం జరగలేదని ప్రయాణికులు పేర్కోన్నారు. ఒక వేళ ప్రాణ నష్టం జరిగి ఉంటే ఎవరూ బాధ్యులని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలని ప్రయాణికులు సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more