అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతూ అంతకంతకూ అదరణ పోందుతున్న హైదరాబాద్ మహానగరంలోని జనజీవనాన్ని గత పక్షం రోజులకు పైగా కురుస్తున్న వర్షాలు స్థంబింపజేశాయి. మొదట్లో కేవలం రాత్రిళ్లు మాత్రమే కురిసిన వర్షం., రానురాను సాయంకాలం కాగానే నగరవాసుల్ని తడిపి ముద్దచేస్తోంది. ఇక గత వారం రోజులుగా నిత్యం మేఘాలు అలుముకున్న నగరంలో అప్పుడప్పుడు ఎడతెరపినిస్తూవరుణుడు తన ప్రతాపాన్ని చాటుతున్నాడు.
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని లొత్తట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. వాన పేరెత్తితేనే నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్లు చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొన్నారు. హయత్ నగర్ డివిజన్ లోని సుష్మా సాయినగర్ ‘గ్రీన్ మిడోస్ కాలనీ’లోకి వెళ్లే దారి కూడా పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. ఇళ్లకు వెళ్లే దారిలేక కాలనీ వాసులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
దీంతో వారు ఆ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వర్షపు నీటిలో పడుకుని నిరసన తెలిపారు. కాగా, తిరుమల్ రెడ్డి గతంలోనూ ఇలానే వినూత్నంగా నిరసన తెలిపి వార్తల్లోకి ఎక్కారు. రోడ్లపై చెత్తను శుభ్రం చేస్తూ, నాలాల్లో చెత్తను తొలగిస్తున్న ఆయన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
తదేకంగా ప్రతీ రోజు కురుస్తున్న వర్షాల కారణంగా ఇద్దరు మృతి చెందిన ఘటనలు నగరంలో చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరని వరుణుడు బలితీసుకున్నాడు. శేరిలింగంపల్లిలో ఓ ఫిట్ నెస్ ట్రైయినర్ విద్యుద్ఘాతంతో మరణించగా, చైతన్యపురిలో ఓ అర్చకుడు ప్రమాదవశాత్తు నాలాలో పడి మృత్యువాత పడ్డాడు. శేరిలింగంపల్లిలోని మణికంఠ మెన్స్ హాస్టల్ లో వుంటున్న అడమ్ మార్క్ జోర్డన్ అనే 23 ఏళ్ల ఫిట్ నెస్ ట్రైయినర్ రాత్రి 11.30 నిమిషాలకు జిమ్ నుంచి హాస్టల్ కు వెళ్తన్నాడు.
అడమ్ ఒక ఉక్కు రాడ్డు వుండటంతో దానిపై కాలు పెట్టి నీటి నుంచి దాటేందుకు ప్రయత్నించాడు. ఆ రాడ్డు నేరుగా విద్యుత్ పాస్ కావిద్యుద్ఘాతంతో మరణించాడు. ఈ ఘటన సరిగ్గా ఆయన హాస్టల్ గేటుకు ముందరే జరిగినా.. వర్షం వల్ల ఎవ్వరూ చూడకపోవడంతో కాపాడలేకపోయారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని పోలీసులు తెలిపారు. ఇక మరో ఘటనలో చైతన్యపురిలో ప్రేమ్ కుమార్ శాస్త్రీ అనే 43ఏళ్ల అర్చకుడు నాలా పడి గల్లంతయ్యాడు.
రామకృష్ణ శర్మ అనే మరో బ్రాహ్మణుడితో కలసి పనిపై వెళ్లాడు ప్రేమ్ కుమార్. పెద్దఅంబర్ పేట్ వద్ద తమ బైక్ ను నిలిపిన పని ముగించుకున్నారు. ఈ క్రమంలో రాత్రి 11.40 నిమిషాలకు వారు చైతన్యపురికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో అనుకోకుండా ప్రమదానికి గురయ్యారు. దీంతో ఇద్దరు అదుపుతప్పి నాలాలో పడిపోయారు. అయితే రామకృష్ణ నాలా నుంచి తప్పించుకున్నా.. ప్రేమ్ కుమార్ మాత్రం నీళ్లలో గల్లంతయ్యాడు. సుమారు వంద మీటర్ల దూరంలో అతని మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more