ఆంధ్రరాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగుతుందా.? లేదా.? రాష్ట్రం ప్రజలంతా ఇప్పుడు ఇదే విషయమై చర్చిస్తున్నారు. రైళ్లలో వెళ్తున్నా బస్సుల్లో వెళ్తున్నా.. గ్రామాల్లో కూడళ్ల వద్ద కలసినా..లేక పట్టణాల్లో కూడళ్ల వద్ద ఎదురైనా.. అందరిముందన్న ఒకే అంశం ఇది. అమరావతి కాకపోతే రాజధానిగా ఏ ప్రాంతం తయారుకానుందన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అక్కడే నిర్మిస్తారా లేదంటే ఎక్కడికో తీసుకెళతారా... అసలు రాజకీయ నాయకులు ఎందుకిలా మాట్లాడుతున్నారు... మంత్రులు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు రాజధానిపై చెప్పేస్తున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడరేంటి? నిజంగా అమరావతి అంతే సంగతులా? అమరావతి అదిగో అంటూ చంద్రబాబు చందమామలా చూపించిన రాజధాని నగరం కలలో స్వప్నంగానే మారనుందా.? లేక ఇలలో సాక్ష్యాత్కరిస్తోందా.? ఇలాంటి అనేక సందేహాలు రాష్ట్ర ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి కోసం భూములను ఇచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని రాజకీయ పక్షాలను కలసి తమ బాధను చెప్పుకున్నారు. అలాగే హైదరాబాద్ వెళ్లి జనసేనాని పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు. అయితే అందరి నాయకుల్లా చూస్తామని మాట ఇవ్వకుండా తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తానని రంగంలోకి దిగాడు పవన్ కల్యాణ్.
అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతుల వేదన కోసం ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించారు. క్రితం రోజు ఆయన మంగళగిరిలో పర్యటించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ వైపుకు ఆవేశంగా పరుగులు తీస్తూ వచ్చాడు. అతడెందుకు అలా వచ్చాడా అని చూసేలోపు సంచీలోనుంచి కొత్త చెప్పుల జత తీసి... అన్నా, పవనన్నా... నీకోసం కొత్త చెప్పులు తెచ్చానన్నా అంటూ పవన్ చేతుల్లో పెట్టాడు. ఇవి తాను పవన్ కల్యాణ్ కోసం తన స్వహస్తాలతో తయారు చేశానని ఆ యువకుడు జనసేనానికి అందించాడు. నవ్వుతూ వాటిని తీసుకున్న పవన్ కల్యాణ్.. వాటిని ధరించే అమరావతిలో పర్యటించడం గమనార్హం. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేవు మరి.
(And get your daily news straight to your inbox)
Jan 27 | భాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా కొనసాగుతూ.. న్యాయస్థానంలో వున్న పెండింగ్ కేసుల విచారణకు గైర్హజరు అవుతున్న ప్రజాప్రతినిధులకు ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ ఎమ్మెల్యే ద్యాసం... Read more
Jan 27 | చిన్నారులకు సంబంధించి నేరుగా శరీరానికి శరీరం తాకితేనే అది పోస్కో చట్టం కింద లైంగిక వేధింపుల కేసుగా పరిగణించ బడుతుందని బాంబే హైకోర్టు వెలువరించిన వివాదాస్పద తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే... Read more
Jan 27 | జనసేన పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన చేప్పిన విషయాలు జనసేన కార్యకర్తలకు మంచి ఊపును అందిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ తరుణం వస్తుందా అని వేచి చూసిన... Read more
Jan 27 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శరవేగంగా ఎన్నికల పనులకు పూనుకున్నారు. సోమవారం... Read more
Jan 27 | ఫేస్ బుక్.. సామాజిక మాధ్యమ దిగ్గజం.. కోట్లాది మంది అకౌంట్ హోల్డర్లకు తమ భావాలను, అనుభవాలను, అనుభూతులను ప్రపంచానికి తెలియజేసే వేదికగా, గుర్తింపును తీసుకువచ్చే వారధిగా అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫేస్ బుక్... Read more