ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 94.88గా ఉండగా ఇందులో అమ్మాయిల శాతం 95.09గా ఉంది. బాలుర శాతం 94.68గా ఉందని ప్రకటించారు. ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా టెన్త్ ఫలితాలలో బాలికలదే పైచేయి అని ఆమె ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 98.19 శాతం ఉత్తీర్ణత రాగా అత్యల్పంగా నెల్లూరులో 83.19 శాతం ఉత్తీర్ణత వచ్చినట్లు ఆమె తెలిపారు.
మొత్తం 6,30,082 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని వారిలో పదివేల 588 మంది ప్రైవేటు విద్యార్థులని చెప్పారు. 11వేల 690 స్కూళ్లకు గాను 5వేల 464 స్కూళ్లు 46.47 శాతం పాఠశాలలో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె తెలిపారు. గత ఏడాది 17 పాఠశాలలో సున్నాశాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సారి కేవలం 3 స్కూళ్లల్లో 0 శాతం ఉత్తీర్ణత వచ్చినట్లు ఆమె తెలిపారు. వీటిలో రెండు ప్రైవేటు పాఠశాలలు వుండగా, ఒకటి ఎయిడెడ్ స్కూల్ వుందని అమె తెలిపారు.
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కొరకు మే-30,2019 లోపల సబ్జెక్టు వారీగా రూ.500 ఫీజును చలానా లేదా ఆన్ లైన్ పేమెంట్ చెల్లించాలని ఆమె తెలిపారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.అభ్యర్ధులు ఫలితాలను www. bseap.org, rtgs.ap.gov.in లో తెలుసుకోవచ్చు
- గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.24 శాతంతో రెండో స్థానంలో ఉంది.
- బిసి సంక్షేమ పాఠశాలల్లో 98.14శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచింది
- ఎయిడెడ్ పాఠశాలలో అత్యల్పంగా 87.16 శాతం ఉత్తీర్ణత
- ప్రైవేటు పాఠశాలలో 98.09శాతం ఉత్తీర్ణత
- మోడల్ స్కూళ్లలో 97.17 శాతం పాస్
- కేజీవిబి పాఠశాలల్లో 95.66 శాతం ఉత్తీర్ణత
- 11వేల 690 స్కూళ్లకు గాను 5వేల 464 పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు
- నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన వాటిలో 2351 ప్రభుత్వ పాఠశాలలు, 3113 ప్రైవేటు పాఠశాలలు
- ఆంగ్లం మాద్యమంలో 97.54శాతం ఉత్తీర్ణత సాధించగా, తెలుగులో 90.46శాతం ఉత్తీర్ణత
* రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కొరకు మే-30 చివరి తేదీ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more