తెలంగాణలో వాతావరణంలో ఇవాళ విచిత్ర పరిస్థితులు కనిపించనున్నాయి. వడగాల్పుల విషయంలో ఇప్పటికే సంకేతాలను ఇచ్చి.. హెచ్చరికలను జారీ చేసిన భారత వాతావరణ కేంద్రం తాజాగా ఇవాళ్లి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనింది. కాగా, వర్షాలు కురవని ప్రదేశాల్లో మాత్రం వడగాలులు తమ ప్రభావాన్ని చాటుతాయని కూడా హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుపాను ప్రభావం తెలంగాణపై ఉండదన్న అధికారులు.. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
ఇదిలావుండగా తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. యావత్ తెలంగాణ మిప్పులు కోలిమిలా కుతకుత ఉడుకుతోంది. దీనికి తోడు వడగాల్పులు కూడా వీస్తూ తెలంగాణవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణలోని కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యథిక స్థాయికి చేరుకున్నాయి. నిర్మల్ జిల్లాలో క్రితం రోజున గరిష్టంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మంచిర్యాల, కుమరంభీమ్ అసిఫాబాద్ లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
జైనాథ్ మండలంలోని నిరాల గ్రామానికి చెందిన రాహుల్ అనే 22 ఏళ్ల యువకుడు వడదెబ్బతో మరణించిన ఘటన కూడా తెలంగాణలో నమోదైంది. ఉష్ణోగ్రతలు మంగళవారం రోజు నుంచి కొంత తగ్గుతాయని అధికారులు చెబుతున్నా.. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని, ఎండలో వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంతో అవసరమైతే తప్ప ఎండలో బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more