మానవీయ సంబంధాలన్నీ మనీ సంబంధాలే అన్న రోజులు పోయాయి. వావివరసలు లేని రోజులోచ్చాయి. ఆ మధ్య పిన్నితో అక్రమసంబంధ నెరుపుతున్న ఘటన వెలుగులోకి వస్తే.. తాజాగా కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మామ, తమ సంబంధానికి అడ్డుగా వున్నాడని కన్న కొడుకును అతిదారుణంగా హత్య చేసిన ఘనుడు వైనం పోలీసులు విచారణలో బట్టభయలైంది. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.
పంజాబ్ రాష్ట్రంలోని ఫరీదాకోట్ ఏరియాకు చెందిన 60 ఏళ్ల చోటా సింగ్ అనే వ్యక్తికి ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు రాజ్వీందర్ సింగ్ కు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. భార్య జస్వీర్ కౌర్తో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు రాజ్వీందర్ సింగ్. తన తండ్రిని తనతో పాటు తన ఇంట్లో కొన్నాళ్లు ఉంచుకునేందుకు తండ్రిని ఇంటికి తీసుకొచ్చాడు రాజ్వీందర్ సింగ్. అయితే అతనికి తెలియదు అదే ఆయన చేసిన పెద్ద పోరబాటు అవుతుందని. అదే జరిగింది. ఏకంగా తన ప్రాణాలనే తీసేంత దారుణమే జరిగింది.
కొడుకు ఆఫీసుకు వెళ్లిన సమయంలో కోడలు జస్వీర్ కౌర్ తో ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఇంటి పనులు చూసుకుంటున్న క్రమంలో అమెను దగ్గరయ్యాడు చోటా సింగ్... కొడుకు భార్యను కామదృష్టితో చూడకూడదన్న ఇంకితాన్ని మర్చిన అతను అమెను లొంగదీసుకున్నాడు. ఇద్దరు శారీరికంగా ఒక్కటయ్యారు. అయితే కొన్నాళ్లకు మామా-కోడళ్ల మధ్య కొనసాగుతున్న ఆ సంబంధాన్ని రాజ్విందర్ సింగ్ గుర్తించాడు. తండ్రిని ఏమనాలో తెలియక.. తన భార్యను హెచ్చరించాడు. అంతేకాదు తన తండ్రిని తన ఇంటి నుంచి తన తమ్ముడి ఇంటికి పంపిస్తానని కూడా చెప్పాడు.
దీంతో తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన తండ్రి.. తన కన్న కొడుకునే హతమార్చాలని ఫిక్స్ అయ్యాడు. రాత్రి పడుకున్న తర్వాత రాజ్వీందర్ సింగ్ పై కత్తితో దాడి చేసి.. శవాన్ని ముక్కలు ముక్కలు చేసి బ్యాగులో పెట్టాడు. దాన్ని స్థానికంగా వున్న డ్రైనేజీలో వేయడానికి చోటా సింగ్, జస్వీర్ తో కసలి వెళ్లాడు. అదే సమయంలో ఆయన కూతురు కుమారుడు హతుడి మేనల్లుడు వచ్చాడు. గదిలో రక్తం చూసి, కంగారు పడి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... చోటాసింగ్ ను తమదైన శైలిలో నిలదీయగా విషయం బయటికి వచ్చింది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more