pawan kalyan takes on galla jayadev at guntur గల్లా జయదేవ్ ఇలాకాలో పవన్ కల్యాణ్ ప్రచారం..

Janasena president pawan kalyan takes on galla jayadev at guntur

pawan kalyan, janasena, Pawan Kalyan galla jayadev, Pawan Kalyan bonaboyina srinivas yadav, Pawan Kalyan bonaboyina srinivas yadav guntur, Pawan Kalyan bonaboyina srinivas yadav, bonaboyina srinivas yadav JanaSena, guntur parliamentary constituency, andhra pradesh, politics

janasena president pawan kalyan takes on guntur sitting mp galla jayadev at guntur, asks him why didnot he raised his voice before than at the time of elections.

గల్లా జయదేవ్ ఇలాకాలో పవన్ కల్యాణ్ ప్రచారం..

Posted: 03/25/2019 05:21 PM IST
Janasena president pawan kalyan takes on galla jayadev at guntur

గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ఇలాకాలో ఆయనపై విరుచుకుపడ్డారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్. గుంటూరులో జనసేన పార్టీ నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నికల ముందు మాత్రమే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ గొంతు ఎందుకు ఎత్తారని, అదే గొంతును రెండేళ్ల ముందుకు ఎందుకు వినిపించలేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీ పరిస్థితులను బట్టి మాట మార్చేస్తుందని వపన్ కల్యాణ్ మండిపడ్డారు.

కంఠం తెగిపడాలే తప్ప తాను మాత్రం ఆడినమాట తప్పేది లేదని స్పష్టం చేశారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పార్లమెంటులో గొంతెత్తిన గల్లా జయదేవ్ ఆ మాటేదో ముందే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రశ్నించకపోతే మొదట్లోనే ప్రధానిని నిలదీసి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు అంత అసరమన్న విషయం ప్రధానికి బాగా అర్థమైయ్యి వుండేది కాదా అని ప్రశ్నించారు. టీడీపీ అవకాశవాద రాజకీయ పార్టీ అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు.

రానున్న ఎన్నికల్లో టీడీపీ కోటను బద్దలు కొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. గుంటూరు పార్లమెంటు స్థానం జనసేన అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలంటూ పవన్ ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. గుంటూరు పార్లమెంటు స్థానంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులను ఓడించి జనసేన అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. అధికారం కొన్ని కుటుంబాలకే పరిమితం అవుతోందని, మార్పు కోసం జనసేనకు ఓటేయాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

జిల్లా ప‌ర్య‌ట‌న‌ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ‘జ‌న‌సేన’ అభ్య‌ర్థి షేక్ జియా ఉర్‌ రెహ్మాన్ ఇంటిని సంద‌ర్శించారు జనసేనాని పవన కల్యాణ్. ఈ సంద‌ర్భంగా రెహ్మాన్ త‌ల్లి ఇస్లాం మ‌త గ్రంథాన్ని చ‌దివి వినిపించ‌గా దానిని ఏకాగ్రతతో విన్నారాయన. ప‌వ‌న్‌ రాక‌ను పుర‌స్క‌రించుకుని రుచికరమైన వంటలతో షేక్ జియా ఉర్‌ రెహ్మాన్ ఆతిథ్యం ఏర్పాటు చేయగా, పవన్ కల్యాన్ తో పాటుగా ఆయన పార్టీ నేతలు కూడా బోజనాన్ని అస్వాధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles