ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ.. ఎలా ఉనికి కోల్పోయిందో.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన బీజేపి కూడా ఉనికి కోల్పోతున్న వేళ.. విశాఖ రైల్వే జోన్.. స్వయంగా ప్రధాని పర్యటన బీజేపి శ్రేణుల్లో జోష్ నింపింది. గతంలో టీడీపీతో కలసి పంచుకున్న స్థానాలను స్వతంత్ర్యంగా నిలబెట్టకుంటామన్న అంచనాలకు బీజేపి శ్రేణులు చేరుకున్నారు. మొత్తంగా కాకపోయినా... కనీసం విశాఖ నగరంలో బీజేపీకి పొలిటికల్ మైలేజీ దక్కుతుందనే ప్రచారం జరిగింది.
గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానంతో పాటు విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ... మరోసారి ఈ రెండు సిట్టింగ్ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే విశాఖ రైల్వే జోన్ ప్రకటించినా... పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మోదీ విశాఖ సభ తరువాత రాజకీయ నిర్ణయం తీసుకోవాలని భావించిన విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు... రెండు మూడు రోజుల్లో చంద్రబాబును కలవబోతున్నట్టు విశాఖ జిల్లా రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబును కలిసిన తరువాతే విష్ణుకుమార్ రాజు బీజేపీలో కొనసాగుతారా లేదా అనే అంశంపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం విష్ణుకుమార్ రాజు చంద్రబాబును కలిస్తే... ఆయన పార్టీని వీడినట్టే భావించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. విశాఖలో బీజేపీని దెబ్బతీయడానికి టీడీపీ సైతం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును తమ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more