తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేతల ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. సత్యనారాయణతో పాటూ ఆయన సతీమణి పద్మావతి, ముఖ్య అనుచరులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనలో చేరడం ఆనందంగా ఉందన్నారు సత్యనారాయణ.. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు.
ఆకుల సత్యనారాయణ పార్టీలో చేరడం శుభపరిణామన్నారు పవన్ కళ్యాణ్. 2014లో పొత్తులో భాగంగా ఆకులకు మద్దతిచ్చామని.. ఆయన చేరికతో జనసేన మరింత బలోపేతం అవుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆకుల కుటుంబానికి ప్రత్యేక గౌరవం ఉందని.. జనసేన పార్టీ ఆయనకు అండగా ఉండి ప్రోత్సాహం ఇస్తుందన్నారు జనసేనాని. అంతకుముందు సత్యనారాయణ తన అనుచరులు, మద్దతు దారులతో కలిసి రాజమహేంద్రవరం నుంచి ర్యాలీగా విజయవాడకు బయల్దేరారు.
సాయంత్రానికి విజయవాడ చేరుకొని పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. గత వారమే ఆకుల సత్యనారాయణ తన ఎమ్మెల్యే పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖల్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పంపారు. తర్వాత జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని, రాజకీయ వ్యవస్థను పవన్ ప్రక్షాళన చేస్తారని తనకు నమ్మకం ఉందన్నారు ఆకుల.
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా రాజమండ్రి అర్బన్ స్థానం నుంచి ఆకుల సత్యనారాయణ పోటీ చేసి విజయం సాధించారు. ఓ పక్క ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నా.. ఆయన భార్య పద్మావతి జనసేన పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలంటూ శ్రీకాకుళంలో జనసేనాని చేసిన దీక్షకు మద్దతుగా రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద పద్మావతి దీక్ష చేశారు.
జనసేన పార్టీలో చేరిన రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ ఆకుల సత్యనారాయణ గారు.
— JanaSena Party (@JanaSenaParty) January 21, 2019
Full Album : https://t.co/SV6QaP4W02 pic.twitter.com/Zr7sOxtITu
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more