యూనీటెక్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు సరైందేనని హైదరాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. యూనిటెక్ సంస్థకు రూ.660 కోట్లు చెల్లించాలని గత అక్టోబరులో తెలంగాణ ప్రభుత్వాన్నిఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రాథమికంగా సరైందేనని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో ఆ సంస్థ చెల్లించిన అసలు రూ.165 కోట్లు ముందు చెల్లించాలని, మిగతా రూ.495.55 కోట్ల వడ్డీ వ్యవహారం తరువాత తేలుస్తామని పేర్కొంది.
యూనిటెక్ తరఫున న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వడ్డీ చెల్లింపు వ్యవహారంపై పూర్తిస్థాయి వాదనలు వినాలని కోరారు. సంస్థ ఛైర్మన్ గత ఏడాదిన్నరగా జైల్లో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విఙ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పూర్తిస్థాయి వాదనలు వినేందుకు విచారణను డిసెంబరు 10కి వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండల పరిధిలోని 350 ఎకరాల విస్తీర్ణంలో ఏరోస్పేస్ పార్క్ నిర్మించాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఏపీఐఐసీ 2007లో బహిరంగ వేలం నిర్వహించింది. అప్పటికే ఈ భూమి యాజమాన్యపు హక్కులపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా, ఈ వేలంలో యూనిటెక్ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. నిబంధనల ప్రకారం ఏపీఐఐసీకి ఆ సంస్థ రూ.165 కోట్లు చెల్లించింది. అయితే, న్యాయపరమైన సమస్యలతో ఆ భూమిని యూనీటెక్కు ప్రభుత్వం అప్పగించలేదు.
మరోవైపు, భూ యాజమాన్యపు హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2011లో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇక, 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీఐఐసీ టీఎస్ఐఐసీగా మారడం, ఆ తర్వాత హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. సుప్రీం కూడా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ ఆ భూమిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కుల్లేవంటూ అప్పీల్ను కొట్టివేసింది.
దీంతో యూనిటెక్ కంపెనీ తాము చెల్లించిన రూ.165 కోట్ల వడ్డీతో సహా చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఎస్ఐఐసీని కోరింది. కానీ, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో యూనీటెక్ మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు తుది విచారణ జరిపి అక్టోబరు 23న తీర్పు వెలువరించారు. దీన్ని మరోసారి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. అయితే, ద్విసభ్య ధర్మాసనం సైతం ఈ తీర్పును సమర్దించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more