నిర్భయ ఘటన జరిగింది దేశరాజధానిలోనే. ఈ ఘటనలో ఢిల్లీవాసులు మరీ ముఖ్యంగా యువత.. వారి వెనుకు కొన్ని రాజకీయ శక్తులు వుండి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించేలా ఉద్యమించి.. కొత్త చట్టాలకు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు, నేరప్రవృత్తి కలిగిన మైనర్ మగమృగాళ్ల వయస్సులో మార్పులకు (18 నుంచి 16కు) ఈ కేసు కారణమైంది. అయితే దీంతో ఢిల్లీలో నేరాలు అదుపులోకి వస్తాయని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా దేశరాజధాని కాస్తా నేరాల రాజధానిగా, మహిళలకు రక్షణ అందించలేని నగరంగా మారిపోయింది.
నిర్భయ కేసు తరువాత కూడ ఎందరో మహిళలు లైంగిక దాడులకు గురయ్యారు. అయితే ఇంత జరుగుతున్నా రాజధానిలో మాత్రం ఎవరో ఒకరు తప్ప నూటికి 99.99 శాతం మంది తమ కళ్లముందు ఏలాంటి ఘటనలు జరిగినా తమకెందుకులే అన్న ధోరణిని అవలంభిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తం రోడ్డు ప్రమాదంలో మరణించి.. తనకు సాయం చేయాలని అంగలార్చినా.. అతన్ని పట్టించుకున్న పాపన ఢిల్లీవాసులు పోలేదంటే అందుకు కారణాలను విశ్లేషించాల్సిన అవసరం లేదు. అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఈ ఘటనపై మేల్కొని ప్రజలను మానవతావాదులుగా తీర్చిదిద్దాలని ప్రయత్నాలు చేసింది.
అయితే ఢిల్లీ వాసులు మాత్రం ఇంకా తమకెందుకు అన్న ధోరణిని వీడటం లేదు. తాజాగా ఓ ప్రజారవాణా బస్సులో ఓ విద్యార్థిని పట్ల ఓ కామాంధ మృగం అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సులోని ప్రయాణికులు ఈ తతంగాన్నంతా చూస్తున్నా.. మనకెందుకులే అన్న ధోరణితో ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఆ విద్యార్థిని ధైర్యం చేసి వాడ్ని నిలదీసింది. అంతటితో అగకుండా వాడిని కొడుతూ సాహాయం కోసం అరచింది. అయితే ప్రయాణికులు కళ్లప్పగించి చూస్తున్నారే కాని.. ఆమెకు సాయంగా ఎవరూ రాలేదు. పైశాచిక మృగాన్ని ఒక్క చేయితో లాగుతూ కిందకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.
అయితే వాడు అమెను నెట్టేసి పారిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని కాపాషేడా నుంచి వసంత్ కుంజ్ కు వెళ్తున్న బస్సులో చోటుచేసుకుంది. అయితే చివరకు విద్యార్థిని జరిగిన సంఘటనపై పోలిస్ కంట్రోల్ రూమ్ లోని పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో విద్యార్థినితో అసభ్యంగా ప్రపర్తించిన మగమృగాన్ని అరెస్టుచేసిన పోలీసులు అతను తైక్వాండో ట్రయినర్ గా గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more