కనీవిని ఎరుగని రీతిలో సుమారు వందేళ్ల తరువాత వచ్చి నిండా ముంచి వరద ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కేరళవాసులను మరో పిడుగులాంటి వార్త వణికిస్తుంది. సర్వం కోల్పోయిన కేరళవాసులపై ఇంకా ప్రకృతి ప్రకోపం చాలరినట్లు లేదు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు యుద్దప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడుతున్న తరుణంలో మరో వార్త వారిని నిలువరించగా, కేరళవాసులు మాత్రం ఈ వార్తను తెలుసుకుని గజగజ వణుకుతున్నారు.
కేరళపై మరోమారు తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అరేబియా సముద్ర తీరం, శ్రీలంక తీరానికి సమీపంలో ఉన్న ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళతోపాటు తమిళనాడులోనూ కొన్ని ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో సీఎం పినరయి విజయన్ అధికారులను అప్రమత్తం చేశారు.
ఆదివారం నుంచి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికల ముఖ్యమంత్రి మూడు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసినట్టు చెప్పారు. జాతీయ విపత్తు దళాన్నిఇప్పటికే అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తూ ఎక్కడికక్కడ సహాయ శిభిరాలను ఏఱ్పాటు చేయాలని, ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అదేశించారు.
సముద్రంలో వేటకెళ్లిన మత్స్యకారులు ఐదో తేదీలోపు తీరానికి చేరుకోవాలని ప్రభుత్వం కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళకు పర్యాటకులు రాకపోవడమే మంచిదని ముఖ్యమంత్రి సూచించారు. కాగా, నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి ఈ నెల 8వ తేదీకల్లా అల్ప పీడనంగా మారుతుంది. అనంతరం అది బలపడి భారీ తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more